తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,018 మంది వైరస్ భారీన పడ్డారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,357కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,008 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
గత 24 గంటల్లో 788 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,082కు చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజే ఏడుగురు మృతి చెందగా కరోనా మృతుల సంఖ్య 267కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 881 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: