ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల తీరుపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి కొందరు టీడీపీ అభ్యర్థులు విత్ డ్రా చేసుకుంటున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. విత్ డ్రా చేసుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల  డివిజన్ లలో జనసేన, బిజెపి అభ్యర్థులు ఉంటే వారి తరుపున ప్రచారంలో పాల్గొంటా అని ఆయన ప్రకటించారు.

పార్టీని అమ్ముకున్న వారికి  భవిష్యత్తు ఉండదు అని ఆయన అన్నారు. నమ్ముకున్న వారికి నేను అండగా ఉంటా  అని ఆయన వ్యాఖ్యలు చేసారు. చింతమనేని కామెంట్స్ తో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దెందులూరు నియోజకవర్గ నేత చింతమనేని ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో జోక్యంతో చర్చనీయాంశంగా మారింది. చింతమనేని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: