కేసీఆర్ సీఎం అయ్యాకే మనకి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు మంత్రి తలసాని. అంతకు ముందు మనం ఎన్నో కష్టాలు పడ్డాం అని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికలు వస్తేనే కొన్ని పార్టీలకు గొల్ల కురుమలు గుర్తుకు వస్తారని గతంలో ఏ ప్రభుత్వం చెయ్యని పనులు చేస్తున్నాం అని వెల్లడించారు. పాలన రాని వాళ్ళు ఎన్నో మాట్లాడారు అని విమర్శించారు. ప్రతి కార్యక్రమాన్ని కొందరు విమర్శిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ చేపట్టాం అని ఆయన చెప్పుకొచ్చారు. కొంతమంది దుర్మార్గులు  కేసీఆర్ కుటుంబం పై ఏడుస్తున్నారు అని సో కాల్డ్ నాయకులకు ఏదీ చేత కాదన్నారు. కేంద్రం నుంచి పథకాలు తేవడం వారికి చేత కాదు అని మండిపడ్డారు. మల్లన్న, బీరన్న ల ప్రతి రూపమే కేసీఆర్ అని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ఎన్నికల్లో ఎన్నో మాట్లాడారు అని బండి పోతే బండి ఇస్తా అన్నారు.. అడ్రెస్ లేకుండా పోయారు అని ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: