ఏపీ రాజధాని ప్రాంతం, ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫోన్ రెండు రోజులుగా పనిచేయటం లేదని తెలుస్తోంది. ఇంత ప్రాముఖ్యమైన పోలీస్ స్టేషన్ లో ల్యాండ్ లైన్ పనిచేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. సాక్షాత్తూ పోలీస్ స్టేషన్ సీఐ శేషగిరిరావే ఫోన్ పనిచేయడం లేదని తెలిపిన వీడియో చక్కర్లు కొడుతోంది. గంజాయి బ్యాచ్ పై ఫిర్యాదు చేసేందుకు తాడేపల్లి పోలీసు స్టేషన్ కు ఫోన్ చేసినా ఎవరూ ఫోన్ ఎత్తలేదన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే.. ఈ విమర్శలపై పోలీసులు వివరణ ఇస్తున్నారు. లారీ తగలటం వల్ల టెలిఫోన్ వైర్లు తెగి స్టేషన్ ల్యాండ్ లైన్ ఫోన్ రిపేరులో ఉన్నట్లు  పోలీసులు తెలిపారు. ఈ మేరకు వాట్సప్ లో పోస్టు పెట్టారు. బాధితులు ఎవరైనా తప్పకుండా స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. బాధితులకు  పోలీసులు అన్నివేళలా అండగా ఉంటామని తెలిపారు. అయితే.. దిశ యాప్, దిశ చట్టం అంటూ ప్రభుత్వం ఓవైపు చెబుతుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇలా ఉందా అని జనం ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: