రాష్ట్ర జిడిపి పురోగమనానికి విద్యుత్ శాఖ కీలకమైందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విద్యుత్ శాఖ పై జరిగే వ్యతిరేక ప్రచారానికి కూడా ఆ శాఖే విద్యుత్ సరఫరా చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .  9 గంటల ఉచిత విద్యుత్, రాష్ట్ర అభివృద్ధి లో కీలకమైన ఆక్వా రంగానికి కూడా సబ్సిడీ పై విద్యుత్ ఇస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.


విద్యుత్ సబ్సిడీ ల కోసం 65 వేల కోట్లు వెచిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. జగనన్న కాలనీలకు 3500 కోట్ల రూపాయల వ్యయం తో విద్యుత్ ఇచ్చేందుకు రుణం తీసుకున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. విద్యుత్ సంస్థల సాధించే అభివృద్దే విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు. ఇటీవల కృష్ణపట్నం లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు. పంప్ డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి లో ఏపీ లీడ్ స్టేట్ గా ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఉద్యోగులకు అనుకూలం గానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: