ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు అత్తగారు ఇచ్చిన కార్యాలయాలు కాదని.. ఖాళీ చేసే రోజు వస్తోందన్న విషయాన్ని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గుర్తించుకోవాలని బీజేపీ రాష్ర్ట ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అంటున్నారు. క్యాంపు కార్యాలయాల నుంచి ప్రజలు తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని ప్రేమేందర్ రెడ్డి హెచ్చరించారు. భారాసకు భాజపా అంటే ఎందుకంత భయపడుతోందని ప్రేమేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్ని రకాల నిర్భందాలు చేసినప్పటికీ 24 కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసనలు చేసినట్లు చెప్పారు.

ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేసిన భాజపా నేతలపై విచక్షణ రహితంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ప్రేమేందర్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. భారాస నేతలు గుండాల్లా భాజపా శ్రేణులపై దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారన్నారు. కలెక్టర్ కార్యాలయాల ముందు అరెస్ట్ చేసిన భాజపా నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP