భారత్, అమెరికా ఓ కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు దేశాలు సంయుక్తంగా సైనికులకు ఉపయోగపడే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తయారు చేయబోతున్నాయి. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రకటించారు. ద్వైపాక్షిక చర్చల తర్వాత ఆయన ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. ఇప్పటికే చైనా నుంచి భారత్‌కు పెరుగుతున్న భద్రతా సవాళ్లు ఉన్న సంగతి తెలిసిందే. చైనా సమస్యతో పాటు అనేక సమస్యలపై..ఇరుదేశాలు చర్చించాయి.


అమెరికా నుంచి భారత్ 31MQ 9B డ్రోన్ల కొనుగోలు ఒప్పందం గురించి కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. అయితే సరైన సమయంలో డ్రోన్ల కొనుగోలుపై ప్రకటన ఉంటుంది. అమెరికా, భారత్ బంధం గతం కంటే బలంగా ఉందని అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆయన భారత్ తో చర్చించారు. కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదుల కార్యకలాపాలు పెరుగుతుండడంపైనా చర్చ జరిగింది. ఈ విషయంలో తమ ఆందోళనను భారత్ వ్యక్తం చేసింది. భారత్ ఆందోళనలను అమెరికా మంత్రులు అర్థం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: