దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఫోన్ల గురించి తెలియని వారు ఉండరు.  ఒకప్పుడు నోకియా,  శాంసంగ్ గట్టి పోటీ ఉన్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం మార్కెట్ లో సెల్ ఫోన్ రేట్లు భారీగా తగ్గుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో శాంసంగ్ తన ప్రైమ్ ఫోన్లపై భారీ తగ్గింపును అందజేస్తోంది. గతేడాది లాంచ్ చేసిన గెలాక్సీ జే7 ప్రైమ్‌, గెలాక్సీ జే5 ప్రైమ్‌ల ధరలను తగ్గిస్తున్నట్టు శాంసంగ్‌ ప్రకటించింది. గత నెలలోనే ఈ ఫోన్లకు ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్ కూడా వచ్చింది. 

శాంసంగ్ కంపెనీ తగ్గించిన ధరల ప్రకారం శాంసంగ్‌ గెలాక్సీ జే7 ప్రైమ్‌ ఇప్పుడు రూ.14,900కు లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ.18,790.గెలాక్సీ జే7 ప్రైమ్ ఫీచర్లు 5.50 అంగుళాల డిస్‌ప్లే 1.6 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో 3 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 256 జీబీ వరకు విస్తరణ మెమరీ 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ సెన్సార్.


గెలాక్సీ జే5 ప్రైమ్ ఫీచర్లు 5.00 అంగుళాల డిస్‌ప్లే 1.4గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్ 2 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 256 జీబీ వరకు విస్తరణ మెమరీ 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 2400 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 


మరింత సమాచారం తెలుసుకోండి: