ఇండియాలోని ఎల్ఈడీ
టీవీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని, గ్లోబల్
టీవీ బ్రాండ్ అయినటువంటి COOCA తన టీవీలను ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. నిజానికి ఇప్పటి వరకూ అనేక దేశాలలో తన అమ్మకాలను కొనసాగిస్తున్న ఈ సంస్థ, ఇండియాలో తన ఎల్ఈడీ టీవీలను అతి తక్కువ ధరలో అందరికి అందుబాటులోకి తీసుకొని వచ్చింది అంటే నమ్మండి. ఈ ఎల్ఈడీ టీవీలను 32 అంగుళాల పరిమాణం నుండి కేవలం రూ.8,999 రూపాయలు మాత్రమే అని మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది.
అసలు ఈ టీవీల ప్రత్యేకతలు ఏమిటో చూద్దామా మరి ..డాల్బీ విసిఒన్, డాల్బీ
ఆడియో మరియు కళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చేసే "యాంటీ బ్లూ లైట్ ఐ ప్రొటక్షన్" వంటి వాటిని ముఖ్యమైన వాటిగా తెలుస్తున్నాయి. అలాగే, చాలా తక్కువ ధరలో అతి సన్నని అంచులు కలిగిన బెజెల్ లెస్ టీవీలను కూడా భారతీయ మార్కెట్లోకి పరిచయం చేయడం జరిగింది.
ఇక అసలు విషయమైన ధరలు చుస్తే.. ఈ ఎల్ఈడీ టీవీలను కేవలం రూ. 8,999 ప్రారంభ ధరతో అందించింది. అయితే, ఈ ప్రారంభ ధరలో మీకు 32 అంగుళాల హెడి రెడీ స్మార్ట్ ఎల్ఈడీ
టీవీ లభిస్తుంది. అలాగే, ఒక 50 అంగుళాల 4K UHD స్మార్ట్ టీవీని కేవలం రూ. 24,499 రూపాయల ధరకు మరియు 50 అంగుళాల 4K UHD ఆండ్రాయిడ్
టీవీ ని రూ. 28,499 రుపాయల ధరకు మీకు అందుబాటులో ఉంది. కొత్తగా లాంచ్ చేసిన, ఈ ఎల్ఈడీ టీవీలను ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫారం అయినటువంటి ఫ్లిప్కార్ట్ ద్వారా ప్రజలకు అందిస్తుంది. ఇక ఎందుకు ఆలస్యం తక్కువ ధరలో
టీవీ కావాలని చూస్తున వారు అందరు ఈ ఎల్ఈడీ టీవీని ఈజీగా మీ సొంతం చేసుకోవచ్చు.