ప్రస్తుతం మార్కెట్ లో కార్లకు భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. అయితే ఒక్కో కంపెనీకి ఒక్కో డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం మారుతి, టాటా, హుందాయి కార్లు టాప్ బ్రాండ్ లిస్టులో ఉన్నాయి. కాగా ఇప్పుడు కియా కార్లు మాత్రం టాప్ రేంజులో దూసుకుపోతున్నాయి.. ఇటీవల మార్కెట్ లోకి విడుదల అయిన ఈ కార్లు ఇప్పుడు మేడిన్ ఆంధ్రా కారుగా దూసుకుపోతుంది.. ఈ కారు మార్కెట్ లోకి వచ్చి ఏడాది కావడంతో అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నారు.. కియా సోనెట్, కియా సెల్టోస్ మోడళ్ల ద్వారా ఆ సంస్థ కార్ల అమ్మకాలు దూసుకుపోతున్నాయి. దీంతో కియా మోటార్స్ సేల్స్‌ను మరింత పెంచుకునేలా కొత్త విధానాలను రూపొందిస్తుంది..



రాష్ట్ర వ్యాప్తంగా 300 టచ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. టైర్-4 పట్టణాలు, కొత్త మార్కెట్‌లో విస్తరించే దిశగా కంపెనీ ముందుకు సాగుతుంది. దేశ వ్యాప్తంగా ఈ కార్లకు డిమాండ్ ఉండటంతో ఇంకా పురోగతి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.మారుమూల ప్రాంతాల్లోనూ తమ కార్లు అమ్మేలా ఆ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘మారుమూల ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లడంతో పాటు , డీలర్లకు కూడా మంచి లాభాలను అందించే దిశగా కంపెనీ సన్నాహాలు చేస్తుంది.



మరో రెండు మూడేళ్లలో ఈ కార్ల అమ్మకాలను మరింత పెంచేందుకు మేము ప్రయత్నిస్తున్నాము అని కంపెనీ ఎండీ తయ్ జిన్ ఆశా భావం వ్యక్తం చేశారు.ప్రస్తుతం కియా మోటార్స్‌కు దేశంలోని 160 పట్టణాల్లో 265 టచ్ పాయింట్లు ఉన్నాయి. దేశంలో ప్రతి వెయ్యి మందిలో 22 మందికి మాత్రమే కార్లు ఉన్నాయని, భారత దేశంలో ఈ కార్ల విస్తరణకు అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు..బెంగళూరు, ముంబై, ఫరిదాబాద్ నగరాల్లో స్కిల్ ఎన్‌హాన్స్‌మెంట్, ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి.. వాటి ద్వారా కస్టమర్లకు గల సందేహాలను తీరుస్తానని చెప్పారు. మొత్తానికి ఈ కంపెనీ ఇప్పుడు అరుదైన స్థానాన్ని అందుకుందని తెలుస్తుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: