కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. సాధారణంగా కారు కొనాలంటే చాలా డబ్బు తో కూడుకున్న పని. ఇందుకోసం ఎంతో డబ్బు ఎంతోకాలంగా దాచి పెట్టాల్సి వస్తుంది. ఎన్నో సంవత్సరాలు కష్టపడితే తప్పా, కారు కొనుగోలు చేయలేము . ఇప్పుడు ఇలాంటి వారి కోసమే ఒక శుభవార్త. ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహేంద్ర తాజాగా తన  కార్ మోడల్స్  పై,ఎవరూ ఊహించలేని స్థాయిలో  వినూత్నమైన భారీ ఆఫర్ను ప్రకటించింది. మహీంద్రా కంపెనీ జనవరి నెలలో కార్లపై ఏకంగా రూ 3.06 లక్షల రూపాయల వరకు తగ్గింపు ప్రకటించింది. అయితే మహేంద్ర కంపెనీ తయారు చేసిన కొత్త మోడల్స్ పై ఆఫర్లను  ప్రకటించడం గమనార్హం.

చాలామంది అనుకోవచ్చు కొత్త కార్లు అంటే రీమోడలింగ్ చేశారా? లేదా ఫీచర్స్ ఏమన్నా తగ్గించారా? అని అనుమానం అందరికీ కలవచ్చు. కానీ మహేంద్ర కంపెనీ మాత్రం ఎలాంటి  లోపం లేని అన్ని ఫెసిలిటీస్ కలిగిన కొత్త కార్లను ఆఫర్ లోకి తీసుకువచ్చింది. ఇందుకు కారణం కొనుగోలుదారులను తమ వైపు తిప్పుకోవాలనే  కోరికతో మహేంద్ర సంస్థ  ఈ ఆఫర్ లను ప్రకటించింది. ఇప్పుడు వాటి ఆఫర్లు ఏమిటో చకచకా చూసేద్దాం.

మహీంద్రా కంపెనీ తన కార్ మోడల్స్ అయిన మహీంద్రా అల్టురస్, ఎక్స్‌యూవీ 500, స్కార్పియో, బొలెరో, ఎక్స్‌యూవీ300 వంటి మోడళ్లపై ఆఫర్లు ఉన్నాయి. మహీంద్రా అల్టురస్ జీ4 మోడల్‌పై గరిష్టంగా రూ.3.06 లక్షల వరకు తగ్గించి, కొనుగోలుదారులకు కళ్ళు చెదిరేలా ఆఫర్ను ప్రకటించింది. ఇందులో క్యాష్  డిస్కౌంట్  రూ 2.2 లక్షలు వరకు ఆఫర్ను ప్రకటించింది. ఇక ఎక్స్చేంజ్ బోనస్ రూ.5,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.16,000 తగ్గించింది. దీనితోపాటు మరో 20 వేల రూపాయలు అదనంగా తగ్గించింది మహేంద్ర కంపెనీ.

మహీంద్రా కేయూవీ 100 ఎన్ఎక్స్టీ మోడల్పై రూ.62 వేల వరకు తగ్గింపు పొందే అవకాశాన్ని కల్పించింది. ఎక్స్ యూ వీ 500 మోడల్ పై రూ.20,000 క్యాష్  బెనిఫిట్స్ తోపాటు ఎక్స్చేంజి బోనస్ రూ.20,000,ఆఫర్ కింద పదివేల డిస్కౌంట్ లభిస్తోంది. మహీంద్రా మారోజ్  మోడల్ పై రూ. 41వేల వరకు తగ్గించింది. కాగా ఈ ఆఫర్లు అనేది ప్రాంతాన్ని,షోరూం ని బట్టి ఉంటాయన్న విషయాన్ని కొనుగోలుదారులు  దృష్టిలో పెట్టుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: