కావాల్సిన పదార్థాలు:
చేపముక్కలు - 8
ఉల్లిపాయ పేస్ట్ - 4 స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్-4స్పూన్లు
పచ్చిమిర్చి పేస్ట్- 4స్పూన్లు
జీలకర్ర పొడి- 4 స్పూన్లు
కారం పొడి- 4 స్పూన్లు
పసుపు పొడి- 2 స్పూన్లు
గరం మసాలా పొడి- టీ స్పూన్
జీలకర్ర- 2 స్పూన్లు
కొబ్బరి పాలు- రెండు కప్పులు
నూనె- 4 స్పూన్లు
ఉప్పు- సరిపడా.
తయారీవిధానం :
మొదటగా చేప ముక్కలకు కొద్దిగా పసుపు, ఉప్పు పట్టించి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నూనె పోసి, చేప ముక్కలను నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. అయితే ముక్కలను మరీ ఎక్కువగా వేయించకూడదు. ఫ్రై చేసిన తర్వాత... చేపముక్కలను మరో ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాత్రలో... మరికొంచెం.. నూనె వేసి కాగిన తర్వాత... జీలకర్ర, బిర్యానీ అకు వేసి నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే జీలకర్ర పొడి, కారం, వేసి కాసేపు వేయించాలి. కొద్దిసేపటి తర్వాత... కొబ్బరి పాలను తీసుకొని... ఆ మిశ్రమంలో పోస్తూ... కలుపుతూ ఉండాలి. ఇప్పడు అందులో చేప ముక్కలు వేసి... చిన్నగా కలపాలి... తగినంత ఉప్పువేసి... చేపముక్కలు పూర్తిగా ఉడికే వరకూ సన్నని మంట మీద ఉడికించుకోవాలి.
చివరిగా అందులో గరం మసాలా పొడి వేసి, కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేయాలి. 10 నిమిషాలు అలాగే ఉంచి... స్టౌ మీద నుంచి దించుకోవాలి. అంతే కొబ్బరి పాలతో 'ఫిష్' కర్రీ రెడీ అయినట్లే. అన్నంతో తింటే చాలా రుచికరంగా ఉంటుంది..