ఈ క్రమంలోనే ఛత్తీస్ ఘడ్ లోని భిలాయి ప్రాంతానికి చెందిన యువరాజ్ కూడా ఇందులో ఇంజనీర్ గా ఉద్యోగం పొందాడు. విశ్వకర్మ బాపట్ల, పొన్నూరు మధ్య రైల్వేట్రాక్ నిర్మాలను పనులను పర్యవేక్షించే ఇంజనీర్ గా యువరాజ్ పనిలో కొనసాగుతున్నాడు. ఇతని తో పాటుగా అమరజీత్ మండల్ కూడా ఆ సంస్థలోనే పంప్ ఆపరేటర్ గా వర్క్ చేస్తున్నాడు. ఇతను బెంగాల్ లోని ముర్షీదాబాద్ కు చెందిన వాడు. కాగా ఒకే దగ్గర పనిచేయడంతో వారిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కాగా ఈ మధ్యనే అమరజీత్ బైక్ పై వెలుతూ.. చీరాల సమీపంలో ఓ వృద్ధురాలిని ఢీ కొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణం విడిచింది. కాగా ఈ కేసులో రాజీకి రావడానికి అతనికి రూ. 2 లక్షలు అవసరమయ్యాయి. దాంతో అమరజీత్ యువరాజ్ విశ్వకర్మను డబ్బులను అడిగాడు. కానీ యువరాజ్ మాత్రం దానికి అంగీకరించలేదు. డబ్బులు అడిగితే ఇవ్వలేదన్న కక్ష్య పెంచుకున్నాడు అమరజీత్.. దాంతో ఎలాగైనా అతని నుంచి డబ్బులు తీసుకోవాలని పథకం పన్నాడు.
కాగా ఈ నెల 23న వారిద్దరు పొన్నూరు క్యాంప్ నుంచి వచ్చే క్రమంలో యువరాజ్ అమరజీత్ తో డబ్బుల విషయమై గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అమరజీత్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో యువరాజ్ గొంతు కోసాడు. తీవ్ర రక్త స్రావంతో యువరాజ్ విలవిలలాడుతున్నా అమరజీత్ మాత్రం ఏటీఎం పిన్ నెంబర్ చెప్పాలంటూ వేధించసాగాడు. అయినా యువరాజ్ పిన్ నెంబర్ చెప్పలేదు. దాంతో యువరాజ్ కి పోపం పీక్స్ కు వెళ్లింది. ఇంకేముంది ఇంకోసారి యువరాజ్ గొంతు కోసి చంపాడు. అలాగే డెడ్ బాడీని సమీపంలోని బ్రిడ్జ్ కింద పూడ్చాడు. అయితే విధుల్లోకి అని వెళ్లి యువరాజ్ క్యాంప్ లో కనిపించకపోవడంతో జీఆర్ అధికారులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కాగా సీసీటీవీ పుటేజీ చూసి పోలీసులు అమరజీత్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో అమరజీత్ తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతనిపై హత్య కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.