ఇక్కడ దంపతులకు ఎంత ప్రయత్నించినా పిల్లలు కలగడం లేదు. ఎంత మంది డాక్టర్ల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మూఢనమ్మకాల వైపు వారి దృష్టి మళ్ళింది. ఒక భూత వైద్యుడిని ఆశ్రయించారు. ఇక భూతవైద్యుడు ఏకంగా సంతానం కలిగేలా చేస్తాను అంటూ చెప్పి మాయమాటలతో ఇద్దరు మహిళల ప్రాణాలను బలి తీసుకున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏకంగా ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి విచారించారు పోలీసుల. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
గ్వాలియర్ కి కు చెందిన బంటు బౌదరియా.. మమతా 18 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు వీరికి సంతానం కలగలేదు. అయితే ఎంత మంది వైద్యుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఇటీవలే మిత్రుడు నీరజ్ ఫార్మర్ ఈ దంపతులకు ఒక సలహా ఇచ్చాడు భూతవైద్యుడు గా చెప్పుకుంటున్న గిరి యాదవ్ వద్దకు వెళితే ప్రయోజనం ఉంటుంది అంటూ నమ్మబలికాడు. దంపతులు అతని వద్దకు వెళ్లగా బలిస్తే సంతాన యోగం కలుగుతుంది అంటూ చెప్పాడు. దీంతో ఏకంగా మనిషిని బలి ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు ఈ దంపతులు. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ సెక్స్ వర్కర్ ను తీసుకొచ్చి ఆమెను బలి ఇచ్చారు. ఇక మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించగా ఓ చోట మృతదేహం కింద పడిపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఇక మరో వారం రోజుల కిందటే మరో సెక్స్ వర్కర్ ని కూడా ట్రాప్ చేసి ఇలాగే బలి ఇచ్చారు. చివరికి పోలీసులకు మృతదేహం లభించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.