ఈ విషాదకరమైన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని దావా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గౌరవ్ అనే 22 ఏళ్ల యువకుడు ఇటీవలే పెళ్లి చేసుకుని భార్యతో కలిసి ఢిల్లీ వెళ్ళాడు. కానీ హఠాత్తుగా ఆమెను అక్కడే వదిలేసి స్వగ్రామానికి వచ్చిన యువకుడు.. ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే గౌరవ్ ఆత్మహత్య తర్వాత అదే గ్రామం లో మరో అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఘటనకు కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది. గ్రామంలోని ఒక బావి వద్ద ఓ యువకుడి చెప్పుల తో పాటు మరికొన్ని వస్తువులు కనుగొన్నారు స్థానికులు. ఈ క్రమంలోనే బావిలో మృతదేహం తేలి ఉండడానికి కూడా గమనించారు.
అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఇక గౌరవ్ ఆత్మహత్య వార్త తెలిసిందో లేదో గౌరవ్ ఇంటికి యాభై మీటర్ల దూరంలో ఉండే ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. అయితే అతని ఇంటికి యాభై మీటర్ల దూరంలో ఉన్న 19 ఏళ్ళ సాధన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అయితే ఈ ఇద్దరు ప్రేమించుకున్నారు అని ఇక వీరి పెళ్లి పెద్దలు అంగీకరించక ఇక గౌరవ్ కి మరో పెళ్లి చేయడంతో ఇలా ఆత్మహత్య చేసుకున్నారు అని అనుమానంతో పోలీసులు విచారణ చేస్తూ ఉండడం గమనార్హం.