విధి ఆడే వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మలాంటివి మాత్రమే అనే భావన కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత అందరికీ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనుషులను పుట్టించిన దేవుడు ఆ మనుషులకు కావాల్సింది ఇవ్వడం మాత్రం కొన్ని కొన్ని సార్లు మర్చిపోయాడేమో అని కొంతమంది పరిస్థితి చూస్తూ ఉంటే అందరికీ అనిపిస్తూ ఉంటుంది. మనిషి జీవితంతో వింతైన నాటకం ఆడి ఏకంగా.. సొంత మనుషులని దారుణంగా హత్యలు చేసే పరిస్థితిని ఆ విధి కొన్ని కొన్ని సార్లు తీసుకు వస్తూ ఉంటుంది.


 ఇక ఇలాంటి ఘటనలు చూసినప్పుడు విధి ఆడిన వింత నాటకంలో మనం కేవలం కీలుబొమ్మలం మాత్రమే అని మనుషులకు అర్థమవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. అతనికి భార్య పిల్లలు ఉన్నారు. కుటుంబం ఉన్నదాంట్లో సర్దుకుపోతూ ఎంతో సాఫీగా జీవితాన్ని గడుపుతుంది. దేశంలో ఆర్థిక సంక్షోభం. నిత్యవసరాలు ధరలు ఆకాశాన్ని అంటాయ్. వచ్చిన దాంట్లో కడుపు నింపుకోలేని పరిస్థితి. అంతలోనే ఆ కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముంటాయి. కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చింది. దీంతో ఆ కుటుంబంలో ఆకలి కేకలు మొదలయ్యాయి. ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాలేదు.


 చివరికి విధి ఆడిన వింత నాటకంలో అతను ఒక హంతకుడిగా మారిపోయాడు. ఏకంగా ప్రేమగా చూసుకున్న భార్యని కంటికి రెప్పల కాచుకున్న పిల్లలని దారుణంగా హతమార్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన పాకిస్తాన్లో వెలుగులోకి వచ్చింది. సర్జాద్ కోకర్ అనే కూలి తన భార్య కౌసర్, ఏడుగురు పిల్లలను గొడ్డలితో దారుణంగా నరికి చంపేశాడు. అయితే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నించగా తన భార్య పిల్లలకు తిండి పెట్టలని పరిస్థితిలో ఉన్నానని.. వారి ఆకలి బాధ చూడలేక ఈ ఘాతుకానికి వడగట్టినట్లు వెల్లడించాడు. అయితే ఈ ఘటనపై పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియం నవాజ్ సంతాపం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం పాకిస్థాన్ లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో  నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: