ప్రేయసి తనను మోసం చేసి మరోకర్నీ పెళ్లి చేసుకోవడం తట్టుకోలేక ఓ ప్రియుడు ఆమెను హత్య చేయాలనుకున్నాడు. ఇంటికి బాంబ్ ని పార్శిల్ చేశాడు. ఏముందని తీసినందుకు ఇద్దరి ప్రాణాలు పోయాయి. మరో ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.  అయితే తన చేతికి మట్టి అంటకుండా 20 ఏళ్ల క్రితం వచ్చిన తెలుగు సినిమాను ఫాలో అయిపోయాడు. సేమ్ టూ సేమ్ అలానే జరిగింది.


గుజరాత్ కి చెందిన 31 ఏళ్ల జయంత్ భాయ్ ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఆమెకి దగ్గరగా ఉన్నాడు. సీన్ కట్ చేస్తే ఆమెకు వేరొకరితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. తన ప్రియురాలు మరొకరని పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయాడు. ఆమెని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఎలా చంపాలని పలు విధాలుగా ఆలోచించి.. చివరకు పార్శిల్ బాంబ్ ద్వారా చంపాలని నిర్ణయించుకున్నాడు.


ప్లాన్ ఓకే.. మరి బాంబ్ కు మెటీరియల్ ఎక్కడ అని ఆలోచించి.. గుజరాత్ లో అయితే ఎవరికి అయినా అనుమానం వస్తుందని భావించి పొరుగు రాష్ట్రమైన రాజస్థాన్ నుంచి బాంబ్ కు కావాల్సిన సామగ్రిని తెచ్చుకున్నాడు. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, టేప్ రికార్డర్ కొనుగోలు చేశాడు. అక్కడ నుంచి గుజరాత్ వచ్చి బాంబు తయారు చేయడం నేర్చుకున్నాడు.


కొరియర్ ద్వారా పంపిస్తే దొరకిపోతానని భావించి ఆటో డ్రైవర్ చేత పార్శిల్ బాంబ్ ను తన ప్రియురాలి ఇంటికి పంపాడు. పార్శిల్ వచ్చిన సమయంలో ఇంటో అతని ప్రియురాలు లేదు. ఇంటికి టేప్ రికార్డర్ రావడంతో ఆమె భర్త దానిని ఆన్ చేశాడు. అది పేలింది. వెంటనే అతను చనిపోయాడు. ఆమె కుమార్తె కూడా మరణించింది. భార్య ఇంట్లో లేకపోవడంతో పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా డెలివరీ చేసిన ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలిని జీతూ భాయ్ వివాహం చేసుకున్నాడనే కారణంతోనే అతడిని హత్య చేయడానికి నిర్ణయించుకున్నానని నిందితుడు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: