భారతదేశం 76సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుక జరుపుకున్న సందర్భంగా ఎర్రకోట నుండి ప్రధాని నరేంద్ర మోడీ అదే ధీమాని వెల్లడించినట్లుగా తెలుస్తుంది. వచ్చే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా తానే ఇలా ఎర్రకోట నుండి ప్రసంగించే ప్రధానిని అవుతానని ఆయన మొన్న వ్యాఖ్యానించారు. అయితే ఆయన కోరిక నిజంగా నెరవేరుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది భారత దేశంలో.
ఎందుకంటే గతంలో ఉన్నట్లుగా రాజకీయ పార్టీల పోకడలు ఇప్పుడు లేవని తెలుస్తుంది. గతంలో కమ్యూనిస్టు పార్టీ కానీ, సమాజ్వాది పార్టీ గానీ, తృణమూల్ గాని ఈ పార్టీలన్నీ కూడా దేనికి అవే పోటీ చేశాయి గత ఎలక్షన్లలో. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు వాళ్లందరికీ ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి నరేంద్ర మోడీ. కాబట్టి ఆయనను మళ్లీ ప్రధాని కుర్చీని ఎక్కించకూడదని ఈ పార్టీలన్నీ కూడా ఒకే ఒక పార్టీగా అవతరిస్తున్న పరిస్థితి నెలకొంది భారతదేశంలో.
ఒక వ్యక్తిని గెలవనివ్వకూడదని ఇన్ని పార్టీలూ, ఇంతమంది రాజకీయ నాయకులూ ఆలోచిస్తున్నారంటేనే మోడీ స్థానం ఏ లెవెల్ లో ఉందో అర్థమవుతుంది. కమ్యూనిస్టులు, సమాజ్వాది పార్టీ, తృణమూల్ పార్టీ, ఆప్ పార్టీ ఇవన్నీ ఇప్పుడు యూపీఏ లో చేరిపోయాయి. ఇలా ఇన్ని పార్టీల చేరికతో యూపీఏ ఐ ఎన్ డి ఐ ఏ కూటమిగా కొత్త అవతారం ఎత్తింది. అయితే ఇప్పటికే భారతదేశంలోని కర్ణాటక లాంటి అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంటూ వస్తుంది. ఈ సందర్భంలో మళ్లీ మోడీ విజయం అనుమానమే అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి