
అయితే, ఈ ప్రాంగణంలో రెండు ప్రార్థనా మందిరాలను తొలగించాలన్న ప్రతిపాదనపై సీఎం సంయమనం సూచించారు. స్థానికులు ఏర్పాటు చేసిన దేవాలయం తొలగింపుపై అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో, అధికారులను వివరణ కోరారు. ప్రజల మతపరమైన మనోభావాలను గౌరవించాలని, ఆయా మతాలకు చెందిన వారి అభిప్రాయాలకు విరుద్ధంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. ఈ సూచనలతో ప్రార్థనా మందిరాల తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశామని అధికారులు తెలిపారు.
ఎపి భవన్ ప్రాంగణంలో కొత్త భవన నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన అంశం. అయినప్పటికీ, మత సమాజాల సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సీఎం ఉద్ఘాటించారు. అక్రమ నిర్మాణాల తొలగింపు కొనసాగుతుంది కానీ, ప్రార్థనా మందిరాల విషయంలో సమగ్ర సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. చంద్రబాబు రంగంలోకి దిగడంతో వివాదం త్వరలోనే కొలిక్కి వస్తుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు