గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లో భాగమైన సర్వే నంబర్ 201/1లోని ఈ ప్రాంతం పర్యావరణ పరిరక్షణకు కీలకమైందిగా ధర్మాసనం అభిప్రాయపడింది. నగరాల్లో ఊపిరితిత్తులుగా పనిచేసే అటవీ ప్రాంతాలు క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ తీర్పు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సాలార్ జంగ్ మూడవ వారసులుగా పేర్కొన్న కొందరు వ్యక్తులు ఈ భూమి తమ సొత్తని ఆధారాలతో సహా వాదించారు. గతంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, జిల్లా కోర్టు, హైకోర్టు స్థాయిల్లో వారికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి.
అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైదరాబాద్ జాగీర్ల నిర్మూలన రెగ్యులేషన్, అతియత్ ఎంక్వైరీస్ యాక్ట్, ఇనామ్స్ నిర్మూలన చట్టం, తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ వంటి చట్టాలను సమగ్రంగా పరిశీలించిన ధర్మాసనం భూమి ప్రభుత్వానిదేనని నిర్ధారించింది. జాగీర్ల నిర్మూలనతో ఈ ఆస్తి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిందని స్పష్టీకరించింది. 1971 నుంచి పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలను పూర్తి చేసి ఎనిమిది వారాల్లోపు ఈ 102 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో గ్రీన్ కవర్ కాపాడటం అవసరమని ధర్మాసనం గుర్తు చేసింది.ఈ విజయం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతాన్ని తెస్తుంది. విలువైన ఆస్తుల రక్షణతో పాటు పర్యావరణ సంరక్షణకు కూడా దోహదపడుతుంది.
9490520108.. వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి