గత కొన్ని నెలల నుంచి బంగారం పెరిగినప్పటికీ.. మళ్లీ గత కొద్ది రోజులుగా తగ్గు ముఖం పడుతోంది. అయితే బంగారం రేటు పడిపోతున్నప్పుడల్లా కూడా మార్కెటర్స్ ఒక కొత్త కథ సృష్టించి మరి రేట్లు పెంచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అందులోనే మరొక కథను కూడా మొదలుపెట్టారు.. అంతర్జాతీయ పరిణామాలతో పసిడి మరొకసారి డిమాండ్ పెరిగిపోయిందనే విధంగా తెలియజేస్తున్నారు.. అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకపోయినా కూడా అలాంటివి ఉన్నాయంటూ సృష్టించి  బంగారు డిమాండ్ పెంచాలని చూస్తూ ఉన్నారట.అలాగే భారత్ , పాకిస్థాన్ మధ్య యుద్ధం కూడా ఆగిపోయింది. రష్యా, ఉక్రయన్ యుద్ధం కూడా నార్మల్ గా మారిపోయింది.


ఇజ్రాయిల్ వారు మాత్రం నడుస్తూనే ఉంది. ఇక అమెరికాకు సంబంధించిన పరిణామాలు ఎప్పుడూ కూడా రొటీన్ కానీ నడుస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏదో ఒక వంకతో బంగారం ధరలు పెంచడానికి మార్కెట్ నిపుణులు ఇలాంటివి చేస్తూ ఉన్నారనే విధంగా పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు.. ఢిల్లీ మార్కెట్లో 99.9%  స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు 1910 పెరిగింది.. దీంతో ప్రస్తుతం బంగారం ధర 98,450 రూపాయలకు చేరింది..99.5% 5 శాతం స్వచ్ఛత బంగారం సైతం 1870 లాభ పడింది.. దీంతో 98,000 స్థాయికి ఈ బంగారు చేరుకుంది.


బలహీన డాలర్ కూడా పసిడి ధరలకు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈఎస్ క్రెడిట్ రేటింగ్ కూడా డౌన్ గ్రేడ్ చేయడంతో రిస్కీ సైతం ఇన్వెస్టర్లు పరిగణంలోకి తీసుకుంటున్నారట. దీంతో చాలామంది బంగారం పైన  పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయని పెట్టు బడి దారులు ఆసక్తి చూపించారని.. అబన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతనమోహత తెలియజేశారు. కానీ వీరు ఇలానే చెబుతూ ఉన్నప్పటికీ.. వీరి ప్లాన్ అంతా కూడా  మరొకసారి బంగారం ధర పెంచే ప్రయత్నం జరగబోతున్నట్లు కనిపిస్తోందట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: