ఈ చలి కాలంలో మన శరీరానికి, ఎటువంటి అపాయం జరగకుండా కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి. అందుచేతనే ఈ కాలంలో ఎక్కువగా గా సూప్ గల పదార్థాలని మనం తీసుకోవాలంటు వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఇక వీటితో పాటే రోగ నిరోధక శక్తి తగ్గకుండా కొన్ని ఆహారాలను తీసుకోవాలట. ఒకవేళ అలా గనుక తీసుకోకపోతే.. మనకు అనేక వ్యాధులు సంభవించే అవకాశం ఉన్నదట. చలికాలంలో మనల్ని మనం రక్షించుకోవడం కోసం కొన్ని పనులను మనం తింటూ ఉండాలి.. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.

1). పియర్
శీతాకాలంలో ఈ పండు తినడం వల్ల చాలా సులువుగా అరుగుదల అవుతుంది. ఇక దీని రసం కూడా చాలా చాలా మంచిది. ఇది మన శరీరంలో ఉండే ప్రేగులను సురక్షితంగా ఉంచుతుంది. ఇక ఇందులో విటమిన్ సి, ఇ బాగా లభిస్తుంది.

2). దానిమ్మ:
శీతాకాలంలో బాగా దొరికేటటువంటి పండు దానిమ్మ. ఈ పండు లోని గింజలు శరీరంలోని రక్తాన్ని బాగా మెరుగుపరుస్తాయి. ఈ చలి కాలంలో రక్తం కు సంబంధించి, కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుచేతనే వీటిని తీసుకోవడం మంచిది. అంతేకాకుండా ఇది చర్మాన్ని కూడా బాగా మెరుగుపరుస్తుంది.

3). ఆపిల్:
ఇక ఇది చాలా ఖరీదైన పండు. ఇది ఎక్కడైనా అన్ని సీజన్లలో దొరుకుతుంది. మనం ఫిట్ గా ఉండాలంటే వీటిని కచ్చితంగా తింటూ ఉండాలి. ఇందులో విటమిన్-A, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అంతే కాకుండా మెదడు కూడా బాగా పనిచేస్తుంది.

4). జామకాయ:
శీతాకాలంలో ఈ పండును తినకూడదని ఎంతోమంది చెబుతుంటారు.కానీ ఈ కాలంలోనే ఈ పండ్లు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ కాలంలో ఈ పండు తినడం వల్ల పొట్ట మొత్తం శుభ్రం అవ్వడమే కాకుండా జలుబు నుంచి విముక్తి కలిగిస్తుంది.

ఇవే కాకుండా అరటి, రేణి గాయలు, కమలా పండు వంటివి తినడం చాలా మేలట.

మరింత సమాచారం తెలుసుకోండి: