నందమూరి బాలకృష్ణబోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రంపై ట్రైలర్ లాంచ్‌తో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ఎంతో అద్భుతమైన ఈవెంట్‌లో విడుదల చేశారు. అఖండ 2: తాండవం ట్రైలర్ లాంచ్‌ను చిత్రబృందం కర్ణాటకలోని చిక్కబళ్లాపురంలో అత్యంత వైభవంగా నిర్వహించింది. కన్నడ సినీ ప్రముఖుడు శివరాజ్‌కుమార్ (శివన్న) ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

2021లో విడుదలైన అఖండ సృష్టించిన సునామీని మించిపోయే స్థాయిలో ఈ సీక్వెల్ తెరకెక్కిందని ట్రైలర్ స్పష్టంగా చూపించింది. బాలయ్య ఫ్యాన్స్ కోరుకునే భీకర యాక్షన్, మూడ్‌ను ఎగిరేలా చేసే భారీ డైలాగులు – ఈసారి రెట్టింపు స్థాయిలో ఉన్నాయి.

ట్రైలర్‌లో ఏం ఉంది?

“కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి… కష్టమొచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి” అనే పవర్ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. దీనితోనే సినిమాలో సనాతన ధర్మం నేపథ్యాన్ని బోయపాటి ఎంత గ్రాండిగా రాబోతున్నారో వెల్లడవుతోంది. బాలకృష్ణ నోట నుంచి వచ్చే ప్రతి డైలాగ్ థియేటర్లలో అరుపులు కేకలు పెట్టించేలా ఉన్నాయి. ఆధ్యాత్మికత, పౌరాణిక స్పర్శ, అఘోర తత్త్వం… ఇవన్నీ బోయపాటి మార్క్ మాస్ మేనర్లో కలిసిపోవడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అఖండలో దర్శనమిచ్చిన అఘోరా అవతారాన్ని ఈసారి బోయపాటి మరింత లోతైన శక్తితో, విస్తారమైన కాన్వాస్‌పై చూపిస్తున్నారు. అఘోర క్యారెక్టర్ యొక్క లోర్, పవర్, మైథాలజికల్ కనెక్షన్స్… ఇవన్నీ ట్రైలర్‌లోనే చిరు భాగంగా కనిపించాయి. సినిమాలో ఈ యాక్షన్–ఆధ్యాత్మిక యూనివర్స్ ఎంత పెద్దగా ఉండబోతుందో చెప్పకనే చెప్పింది.


తాజాగా చిత్రబృందం ఈ సినిమాను 2డ్తో పాటు 3డ్ వెర్షన్‌లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సినీప్రియులకు కొత్త విజువల్ అనుభవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బాలయ్య మాస్ యాక్షన్ 3డ్లో ఎలా కనపడుతుందో అన్న కుతూహలం మరింత పెరిగింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న అఖండ 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. బోయపాటి–బాలయ్య కాంబోపై ఉన్న నమ్మకం, ఇప్పుడు వచ్చిన ఈ ట్రైలర్… ఇవన్నీ సినిమా వైపు భారీ హైప్‌ను తీసుకొస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: