రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన  భారీ యాక్షన్  చిత్రం సాహో యొక్క ట్రైలర్ కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు  నాలుగు భాషల్లో విడుదలకానుంది.  ఈ ట్రైలర్ను అదే టైం కు కొన్ని థియేటర్లలో కూడా ప్రదర్శించనున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్  అందుకు వేదిక కానుంది. 


కాగా ఒక్కో జిల్లాలో ఒక్కో థియేటర్లలో  ఈసినిమా ట్రైలర్ ను ప్రదర్శించనున్నారు.  ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ , వీడియో సాంగ్స్  సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకోవడంతో ఈ ట్రైలర్ ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. మరి వారి అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.  ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అతి త్వరలో  ఈ వేడుక  జరిగే తేదీని వెల్లడించనున్నారు. 


 'రన్ రాజా రన్'  ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న  ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో  బాలీవుడ్  బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమాతో ఆమె సౌత్ లోకి ఎంట్రీ ఇస్తుంది. కాగా జాకీ ష్రాఫ్ , నిల్ నితిన్ ముఖేష్ ,మురళీ శర్మ , అరుణ్ విజయ్, మందిరా భేది  తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  ఈ చిత్రానికి తనిష్క్ బాఘ్చి , గురు రాంధావ  సంగీతం సమకూరుస్తుండగా తమిళ సంగీత దర్శకుడు  గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో  యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం  ఆగస్టు30న ప్రపంచ వ్యాప్తంగా   భారీ స్థాయిలో విడుదలకానుంది.   






మరింత సమాచారం తెలుసుకోండి: