విజయవాడకు చెందిన సుధీర్, కెరీర్ పరంగా మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో పైకి రావాలని భావించి మొదట హైదరాబాద్ చేరుకున్నాడట. అయితే అక్కడినుండి ఉద్యోగం విషయమై కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొన్న సుధీర్, ఆ తరువాత మెజీషియన్ గా కూడా కొన్ని ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అయితే అదే సమయంలో ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై ప్రవేశించిన సుధీర్, అనతికాలంలోనే తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక జబర్దస్త్ షో పాటు పలు సినిమాల్లో కూడా అక్కడక్కడా కొన్ని చిన్న పాత్రల్లో నటించిన సుధీర్, ఇటీవల తాను హీరోగా ఒక సినిమాను ప్రారంభించాడు. 

నూతన దర్శకుడు రాజశేఖర్ తొలిసారి మెగాఫోన్ పడుతున్న ఈ సినిమాకు 'సాఫ్ట్ వేర్ సుధీర్' అనే టైటిల్ ని నిర్ణయించారు సినిమా యూనిట్. అయితే ఒక సర్ప్రైజింగ్ విషయం ఏమిటంటే, యాంకర్ రష్మీ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయట. ఇప్పటి వరకు జబర్దస్త్, ఢీ జోడి వంటి షోల్లో మంచి పాపులరైన ఈ జంట, ఈ విధంగా తొలిసారి వెండితెరపై కనపడి సందడి చేయనుందన్నమాట. 

ఒక కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్ కూడా ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నాడట. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా సాగనున్న ఈ సినిమాతో సుధీర్ తప్పకుండా హీరోగా మంచి సక్సెస్ ని అందుకుంటాడని సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోందట. అయితే గతంలో జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చి హీరోగా మారిన షకలక శంకర్, ఇప్పటికే హీరోగా పలు సినిమాల్లో నటిస్తున్నాడు, మరి సుధీర్ తొలిసారి హీరోగా నటిస్తున్న ఈ సినిమా అతడికి ఎంతవరకు సక్సెస్ ని ఇస్తుందో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: