ప్రపంచంలో కరోనా ఏ రేంజ్ లో అతలాకుతలం చేస్తుందో ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం.  కరోనాకి రాజు పేద.. సామాన్యులు సెలబ్రెటీలు అనే తేడా లేకుండా అందరినీ పట్టి పీడిస్తుంది.  చాలా మంది కరోనాతో చనిపోయారు కూడా.. తాజాగా కరోనా టాలీవుడ్ లో మరో కలకలం సృష్టించింది.  తాజాగా మెగా బ్రదర్ నాగబాబుకి కరోనా వచ్చింది ఆయనే స్వయంగా తెలిపారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి కరోనా రావడం చనిపోవడం కూడా జరిగింది. కాగా,  ఇటీవల కరోనా పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. వ్యాధి వచ్చిందని బాధపడకుండా, దాని నుంచి కోలుకుని వేరొకరికి సాయం చేయాలని ఆయన అన్నారు.


తాను  జాగ్రత్తలు పాటించి, కరోనాని జయిస్తానని, అనంతరం ప్లాస్మా దానం చేస్తానని ఆయన చెప్పారు. తనను కలిసిన వాళ్లందరూ కూడా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే తనకు కరోనా వచ్చినట్టు స్వయంగా నాగబాబు ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇవ్వడంతో.. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సన్నిహితులు కోరుకుంటున్నారు. ఇక సినీ నటుడు కల్యాణ్‌దేవ్‌ 'మామయ్య మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అంటూ కామెంట్‌ పెట్టారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నాగబాబు సమాధానం ఇచ్చారు.


కాగా, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతోమందికి కరోనా రావడం తగ్గడం కూడా జరిగింది.  అయితే అందులో కరోనాని జయించిన వారు ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.  ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ప్లాస్మా దానం చేసిన విషయం తెలిసిందే.  అయితే కరోనా వచ్చినంత మాత్రాన భయపడి దాన్ని బూచీలా చూడకుండా ధైర్యంగా ఎదుర్కొని పోరాడి జయించి ప్లాస్మా దానం చేయడం ద్వారా మరికొంత మంది ప్రాణాలు కాపాడిన వారు అవుతారని నటుడు నాగబాబు తెలిపారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: