హీరో సుధీర్ బాబు గత ఏడాది నానితో కలిసి వి అనే సినిమా చేశాడు. ఒక రకంగా ఈ సినిమాలో ఆయనదే హీరో క్యారెక్టర్ అన్నట్టు చెప్పారు. కాస్త అటు ఇటుగా అలాగే ఉన్నా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో డిజాస్టర్ తో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన శ్రీ దేవి సోడా సెంటర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా ఆన్ లొకేషన్ పోస్టర్ అంటూ ఒక పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. 

పోస్టర్ లో తెలుగు స్టార్ హీరోస్ తో సినిమాలో రాజా ఫోటో స్టూడియో యజమాని సూరి బాబులాగా ఆయన ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలో ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రజనీ కాంత్, చిరంజీవి ఇలా కొందరు స్టార్ హీరోలు ఉన్నారు. అయితే ఇక్కడ తమ హీరోలు లేరు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే ప్రభాస్ ఫాన్స్ ఇద్దరూ కాస్త రచ్చ చేశారు. 

సుధీర్ బాబుని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి మరీ రకరకాల కామెంట్స్ చేయడంతో రచ్చ మొదలైంది. ఈ దెబ్బకు దిగి వచ్చాడో లేక పెద్ద హీరోల ఫాన్స్ తో ఎందుకు ఇబ్బంది అనుకున్నాడో తెలియదు కానీ నిన్న ఆయన ప్రభాస్ తో ఫోటో దిగి దానిని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఇంకా బన్నీ ది బాకీ ఉంది. అది కూడా త్వరలోనే దిగి అప్లోడ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా పలాస సినిమా దర్శకుడు కరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం తమిళంలో ఫేమస్ అయిన తెలుగు హీరోయిన్ ఆనందిని రోప్ చేశారని ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: