మెగా ఫ్యామిలీకి మరియు కమెడియన్ పృధ్వికి చాలా దూరం ఏర్పడింది.. దీనికి కారణం గతంలో నాగబాబు మరియు పృధ్వి మధ్య జరిగిన మాటల యుద్ధం, రాజకీయ వివాదం. జనసేన నుంచి నాగబాబు ఏదో అన్నారు దానికి వైసీపీ నుంచి పృధ్వి కౌంటర్ ఇచ్చారట.

దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందట..
అయితే అది అలానే కొనసాగుతోందని చాలామంది కూడా అనుకున్నారు. కానీ పృధ్వి మాత్రం అలాంటిదేం లేదన్నాడు. నాగబాబు, తను కలిసిపోయిన విషయాన్ని కూడా బయటపెట్టాడు.

"జీ తెలుగులో ఆమధ్య ఓ కార్యక్రమం కూడా జరిగింది. దానికి నాగబాబు కూడా వచ్చారు. ఆ విషయం నాకు అస్సలు తెలీదు. నేను కూడా వెళ్లాను. చాలా సేపు ఆలోచించాను, లోపలికి వెళ్లాలా వద్దా అని. చివరికి వెళ్లి నాగబాబుకు నమస్కారం చేసి దూరంగా కూర్చున్నానని కాసేపటికి నాగబాబు నన్ను పిలిచారని నాకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారని చెప్పుకొచ్చాడు. తన తమ్ముడిగా నన్ను పరిచయం చేశారు ఆయన. మెగా ఫ్యామిలీలో హీరోలంతా పృధ్విని ఇష్టపడతారంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు.

ఈ సందర్భంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు తనకు బాగా నచ్చాయంటున్నాడు పృధ్వి. రాజకీయాల్ని, సినిమాను ఒకే విధంగా చూడొద్దని చెబుతున్నాడు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడు, ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం కామన్ అని.. సినిమా ఆఫర్ వచ్చినప్పుడు కలిసి నటించాల్సిందేనంటూ నాగబాబు చెప్పిన మాటలు తన మనసుకు బాగా హత్తుకున్నాయంటున్నారు పృధ్వి.

తాజాగా చిరంజీవి అల్లుడితో తను సినిమా చేశానని తనపై మెగా కాంపౌండ్ నిజంగా అంత కోపంగా ఉంటే చిరంజీవి అల్లుడు సినిమాలో తనకు ఆఫర్ వచ్చి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలోనే చిరంజీవి సినిమాలో కూడా నటిస్తానంటున్నాడు పృద్వి..మెగా ఫ్యామిలీ పై ఒకప్పుడు బాగా దారుణంగా కామెంట్ చేసిన పృద్వి కి చిరంజీవి ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: