శ్వేతా బసు ప్రసాద్... ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తెరమీదికి వచ్చి యువత చూపు మొత్తం తనవైపుకు తిప్పుకున్న హీరోయిన్. కొత్త బంగారులోకం లాంటి యూత్ ఫుల్లవ్ ఎంటర్టైనర్ సినిమాలో నటించి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది హీరోయిన్. అందాల ఆరబోత చేయకుండా తన కోర చూపులతోనే అందరిని కట్టిపడేసింది.  అబ్బా శ్వేతా బసు ప్రసాద్  ఎంత క్యూట్ గా ఉందో మా కాలేజీ అమ్మాయి లాగే ఉంది అని అనుకున్నారు ఈ అమ్మడిని చూసిన ప్రేక్షకులు. దీంతో అభిమానించడం మొదలు పెట్టారు..


 కొత్త బంగారు లోకం లాంటి సినిమా హిట్ తర్వాత శ్వేతా బసు ప్రసాద్ కెరియర్ ఊహించని రేంజ్ లో హిట్ అవుతుంది. సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది అని అందరూ అనుకున్నారు.. కానీ సినిమా అనే రంగుల ప్రపంచంలో చీకటి రంగు కూడా ఉంటుంది కదా. ఇలా చీకటి మనుషుల వల్ల ఎంతో మంది హీరోయిన్లు కెరియర్లో నాశనమైపోతుంది. తన కెరియర్ కూడా అలాగే నాశనమైపోయింది అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వాపోయింది శ్వేతాబసుప్రసాద్. ఇక కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో శ్వేతాబసుప్రసాద్ అనుకోకుండా ఒక వివాదాస్పద కేసులో ఇరుక్కుంది. ఈ కేసులో అరెస్టు అయింది కూడా.


 ఇక ఆ తర్వాత ఎలాగోలా ఈ కేసు నుంచి తప్పించుకొని బయటికి వచ్చింది. కానీ ఇంత జరిగిన తర్వాత అవకాశాలు ఇవ్వడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో హీరోయిన్ కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది. ఇక ఇంత జరిగిన తర్వాత ఓ తెలుగు హీరో తనకు ఛాన్స్ అంటూ ముందుకు వచ్చాడట. కానీ ఆ తర్వాత ఛాన్స్ ఇస్తాం అంటూ ఆశపెట్టి మోసగించాడు అంటూ శ్వేతబసు వాపోయింది. చేత కానప్పుడు పబ్లిసిటీ కోసం సొల్లుకబుర్లు ఎందుకు చెప్పాలంటూ ఆ హీరోకి గట్టిగానే క్లాస్ తీసుకుందట హీరోయిన్. ఈ క్రమంలోనే ఇటీవల ఇంటర్వ్యూలో చీకటి మనుషులు అంటూ ప్రస్తావించింది శ్వేతా బసు. బహుశా ఇది ఆ హీరో గురించి కావచ్చు అని కొంత మంది అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: