తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తలపతి విజయ్ ఇప్పటికే ఈ సంవత్సరం బీస్ట్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన తలపతి విజయ్ ప్రస్తుతం వారీసు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఏ సినిమా నుండి కొన్ని పోస్టర్ లను మరియు రెండు పాటలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ముఖ్యంగా ఈ మూవీ లోని రంజితమే సాంగ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో తాజాగా వారిసు మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క రన్ టైమ్ ను 150 నిమిషాలకు  (2 గంటల 30 నిమిషాలకు) చిత్ర బృందం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వారసుడు పేరుతో తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: