మైనే ప్యార్ కియా అంటూ జోడిగా నటించారు సల్మాన్ ఖాన్‌, భాగ్యశ్రీ. ఈ సినిమాలో వీరిద్దరీ యాక్టింగ్ వేరే లెవల్. వీరి నటనకు ఫిదా కాని వారుండరు. వీరిద్దరీ కెమిస్ట్రీ ఎంత బాగా పండిందంటే.. చివరకు సినిమాల నుండి తప్పుకునేంతలా.. ఈవిషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది.

చేసినవి తక్కువ సినిమాలైనా.. అభిమానుల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోతుంటారు కొంత మంది నటీనటులు. అటువంటి వారిలో ఒకరు నటి భాగ్యశ్రీ ఖచ్చితంగా ఉంటారు. మైనే ప్యార్ కియా అంటూ సల్మాన్ ఖాన్‌తో ఆడిపాడింది ఈ చిన్నది. ఈ సినిమాలో వీరిద్దరీ యాక్టింగ్ వేరే లెవల్. పేరుకు బాలీవుడ్ సినిమా అయినప్పటికీ తెలుగులో కూడా ప్రేమ పావురాల పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ వీనుల విందుగా అనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు కూడా ప్రెష్ లుక్ కనిపిస్తోంది. సల్మాన్, భాగ్యశ్రీ నటనకు ఫిదా కాని వారుండరు. వీరిద్దరీ కెమిస్ట్రీ ఎంత బాగా పండిందంటే.. చివరకు సినిమాల నుండి తప్పుకునేంతలా. అవునండీ.. ఈ విషయాన్ని స్వయంగా నటి భాగ్యశ్రీ ఇన్నేళ్ల తర్వాత బయట పెట్టింది.

తెలుగులో ఓంకారం, యువరత్న రాణా సినిమాల్లో నటించిన భాగ్యశ్రీ.. మైనే ప్యార్ కియా తర్వాత తన హిమాలయ దాసానిని వివాహం చేసుకుంది. అయితే మైనే ప్యార్ కియా సినిమా ముగిసిన తర్వాత సల్మాన్‌తో ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చాయని, దాని వల్ల తానెంతో ఇబ్బందులకు గురైనట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అవి ఎంతలా బాధపట్టేయో.. ఆ సంఘటన గురించి వెల్లడించింది భాగ్యశ్రీ. తన మొదటి బిడ్డ అభిమన్యు పుటినప్పుడు జరిగిన విషయాన్ని ఆమె గుర్తుచేసుకుంది. ‘నాకు మొదటి బిడ్డ పుట్టినపుడు ఆస్పత్రిలో ఉన్నాను. ఒక రిపోర్టర్ బొకేతో వచ్చి నన్ను కలవాలని రూమ్ బయట నిలబడిన నా భర్త సోదరిని అడిగింది. ఆమెను లోపలికి అనుమతించిన తర్వాత.. నా భర్త వైపు చూసి భాగ్యశ్రీకి సల్మాన్‌తో అక్రమ సంబంధం ఉంది. ఇప్పుడు ఆమె మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారని అడిగారు’ అని భాగ్యశ్రీ గుర్తు చేసుకుంది.

దీంతో తాను ఒక్కసారిగా షాక్ కు గురయ్యానని, అప్పటి వరకు తాను అలాంటి మాటలు వినలేదని చెప్పింది. నిజానికి ‘మైనే ప్యార్ కియా’ షూటింగ్ టైమ్‌లో సల్మాన్ ఒక జెంటిల్‌మ్యాన్ అని భాగ్యశ్రీ చెప్పింది. అప్పటి వరకు అలాంటి మాటలు తాను వినలేదని, మా ఇద్దరి మధ్య అటువంటి సంబంధం లేదని, ఎవ్వరూ కూడా అలా తమ అనలేదని ఎమోషనల్ అయ్యారు. బిడ్డ పుట్టిన మరుసటి రోజే ఇటువంటి వినాల్సి వచ్చిందన్నారు. దీని తర్వాత తాను సినిమా మ్యాగ్జిన్స్ చదవడం మానేసి.. సినిమా పరిశ్రమకు దూరంగా ఉండిపోయాను అని చెప్పుకొచ్చారు. భాగ్యశ్రీ గతేడాది విడుదలైన ‘రాధేశ్యామ్’ చిత్రంలో ప్రభాస్ తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ తో కలిసి అం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాలో నటించిన సంగతి విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: