టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు... టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రష్మిక మందన్న... టాలీవుడ్ సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసింది. కాగా ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతుంది  . అంగరంగ వైభవంగా ఎల్బీ స్టేడియం వేదికగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ప్రీ  రిలీజ్ ఈవెంట్ ప్రారంభమైంది. కాగా  ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు  అభిమానులతోపాటు... మరోవైపు మెగాస్టార్ అభిమానులు కూడా భారీగా తరలివచ్చారు. 

 


 ఈ మెగా సూపర్ ఈవెంట్ ని ఎంతో కోలాహలంగా జరుగుతుంది . ఈ కార్యక్రమంలో మాట్లాడిన రామజోగయ్య శాస్త్రి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తాను  రెండు పాటలు రాశాను అని చెప్పారు . తను రాసిన రెండు పాటలు అద్భుతమైన లిరిక్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి అంటూ రామజోగయ్య శాస్త్రి తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాదు అంతకు మించి అంటూ రామజోగయ్యశాస్త్రి వ్యాఖ్యానించారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన స్టైల్ కామెడీ టైమింగ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కథను అద్భుతంగా తెరకెక్కించారని రామజోగయ్య శాస్త్రి తెలిపారు.

 


 సరిలేరు నీకెవ్వరు సినిమాకు  హిట్టు బ్లాక్ బస్టర్ హిట్ పదాలు సరిపోవు అని అంతకుమించి అనేలా ఉంటుంది అంటూ రామజోగయ్య శాస్త్రి తెలిపారు. సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ ను మహేష్ బాబు కరెక్ట్ గా  సరిపోతుందని... అందుకే ఈ సినిమాకు మహేష్ బాబుని దర్శకుడు అనిల్ రావిపూడి సెలెక్ట్ చేసుకున్నారు అంటూ రామజోగయ్య శాస్త్రి తెలిపారు. అంతేకాకుండా రాజేంద్రప్రసాద్ ప్రకాశ్ రాజ్ లు  తమ తమ నటనతో సినిమాలో ఎంతగానో ప్రేక్షకులను అలరిస్తారని రామజోగయ్య శాస్త్రి అన్నారు. ఇక 13 ఏళ్ల తర్వాత విజయశాంతి ఈ  సినిమా తో రీ ఎంట్రీ ఇస్తూ ఎంతో ఉత్సాహంగా నటించారు అంటూ రామజోగయ్యశాస్త్రి చెప్పుకొచ్చారు. మొత్తంగా ఈ సినిమా అంతకుమించి అన్నట్లుగా హిట్ కావడం ఖాయమని రామజోగయ్యశాస్త్రి ధీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: