అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా మారిన నందినీ రెడ్డి ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. నాని, నిత్య మీనన హీరో హీరోయిన్లుగా నటించిన ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే మొదటి సినిమా విజయం తర్వాత ఆమె చేసిన సినిమలేవీ సక్సెస్ అవ్వలేదు. ఇక ఆమె కెరీర్ ముగిసిపోతుందేమో అన్న తరుణంలో కొరియన్ సినిమాని తెలుగులో ఓ బేబీగా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది.

 


ఓ బేబీలో సమంత హీరోయిన్ గా నటించింది. కొరియన్ మూవీ మిస్ గ్రానీ కి అఫీషియల్ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంలో సమంత నటనని విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అతి తక్కువ రోజుల్లో సినిమాని తెరకెక్కించిన నందినీ రెడ్డి, మళ్ళీ తనని తాను నిరూపించుకుంది, అయితే ఓ బేబి తర్వాత నందినీ రెడ్డి డైరెక్ట్ చేసే సినిమాపై ఎన్నో పుకార్లు వచ్చాయి. నందినీ రెడ్డి మరోసారి సమంతని డైరెక్ట్ చేయనుందని, అది కూడా ఒక కొరియన్ రీమేక్ అని అన్నారు.

 

తాజాగా ఈ విషయమై నందినీ రెడ్డి క్లారిటీ ఇచ్చింది. తాను రీమేక్ చేయట్లేదని, స్ట్రెయిట్ తెలుగు సినిమానే చేస్తున్నాని, వైజయంతీ మూవీస్ బ్యానర్ లో స్వప్నా నిర్మాతగా ఈ మూవీ తెరకెక్కనుందని తెలిపింది. అందువల్ల ఏమీ తెలియకుండా ఇలాంటి పుకార్లు నమ్మవద్దని కోరింది. అయితే సమంతతో మళ్లీ సినిమా చేస్తారా అని అడిగితే, చేసే అవకాశం ఉంది కానీ, ఇప్పట్లో ఉండకపోవచ్చు అని చెప్పింది.

 

ఇక ఆమె తర్వాతి సినిమా నాగచైతన్య హీరోగా ఉంటుందని సమాచారం. గీత గోవిందమ్ దర్శకుడు పరశురామ్ తో సినిమా క్యాన్సిల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నందున చైతన్యని నందినీ రెడ్డి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఓ బేబిలో చైతన్య క్యామియో రోల్ చేశాడు. మరి ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: