మహేష్ బాబు ఇటీవల వరుసగా భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో మూడు విజయాలు అందుకుని హ్యాట్రిక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దానితో మంచి జోష్ మీదున్న సూపర్ స్టార్, ఇటీవల కొద్దిరోజులుగా తన తదుపరి సినిమా విషయమై దర్శకుడిని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. కాగా ఇటీవల గీత గోవిందం దర్శకుడు పరశురామ్ చెప్పిన కథకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. మహేష్, కొరటాల శివ, మైత్రి మూవీ మేకర్స్ కలిసి సంయుక్తంగా ఎంతో భారీగా నిర్మించనున్న ఈ సినిమా యొక్క ప్రారంభోత్సవం సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న జరుగనున్నట్లు టాక్. 

 

ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ అదిరిపోతుందని, మంచి రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పరశురామ్ ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇకపోతే కాసేపటి క్రితం టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, ఒక తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ హీరోగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మాతగా తెరకెక్కనుందని వెల్లడించారు. వాస్తవానికి ఈ విషయం ఎప్పటినుండో ప్రచారం అవుతున్నప్పటికీ, నేడు దీనిని కన్ఫర్మ్ చేసారు రాజమౌళి. నిజానికి మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎప్పటినుండో వేచి చూస్తున్నారు అనే చెప్పాలి. మహేష్ వంటి సూపర్ స్టార్ ని రాజమౌళి ఏ విధంగా చూపిస్తారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. 

 

ఇక రాజమౌళి నోటి నుండి ఇలా ప్రకటన రాగానే, సూపర్ స్టార్ ఫ్యాన్స్ అలా ఆ మ్యాటర్ ని ఎంతో ఆనందంతో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ చేస్తుండడంతో పాటు ట్విట్టర్ లో పెద్ద ట్రెండ్ ని క్రియేట్ చేసి పరిగెత్తిస్తున్నారు. అయితే మహేష్ బాబుతో నేను ఎటువంటి సినిమా చేయాలని మీరు భావిస్తున్నారు అంటూ కొన్నేళ్ల క్రితం మహేష్ నటించిన బిజినెస్ మాన్ ఆడియో ఫంక్షన్ లో రాజమౌళి సూపర్ స్టార్ అభిమానులను అడుగగా, మెజారిటీ ప్రేక్షకుల నుండి జేమ్స్ బాండ్ తరహా సినిమా అంటూ సమాధానం రావడం జరిగింది. మరి నిజంగానే రాజమౌళి, మహేష్ ని నిజంగా ఒక జేమ్స్ బాండ్ లా చూపిస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: