మామూలుగా అయితే కొంతమంది దర్శకులు అప్పుడప్పుడు సంగీత దర్శకులుగా కూడా మారిపోతూ ఉంటారూ.  ఇక్కడ ఇలాంటిదే జరిగింది. దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పీఏ విజయ్... ప్రస్తుతం సంగీత దర్శకుడిగా అవతారమెత్తాడు. తాను దర్శకత్వం వహించిన మూడవ చిత్రం మేథవి గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్... తాను ఆరుద్ర సినిమా దర్శకత్వం వహించిన సమయంలోనే మేథవి అనే థ్రిల్లర్ సినిమా కోసం ఆలోచించాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా కోసం నటులు అర్జున్ జీవ మరియు రాసి కన్నా లు సహా మరింత మంది ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మేధవిని మక్కల్ అసరన్  పిక్చర్స్ ఎస్. రాజా నిర్మించారు.. 

 


 అయితే ఈ హారర్ చిత్రానికి ఏకంగా తాను కూడా సంగీతం కంపోజ్ చేస్తున్నాను  అంటూ చెప్పుకొచ్చాడు. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజ తో కలిసి పని చేయడం పట్ల చిత్ర నిర్మాత ఎంతగానో ఆశ్చర్యపోతున్నారని... కానీ యువన్ శంకర్ రాజ తో తాను ఎన్నోసార్లు స్వరకర్తగా రచయితగా ఎన్నో సినిమాల్లో పని చేశాను  అంటూ గుర్తు చేశారు. అయితే యువన్ శంకర్ రాజా  మాత్రం తన చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయడం ఇదే మొదటిసారి అంటూ చెప్పుకొచ్చాడు. 

 

 ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో  ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే దానిపై స్పష్టత లేదని తెలిపిన విజయ్... ముందుగా చిత్రనిర్మాత రాజాపై ప్రశంసలు కురిపించాడు. ఈ కథను వినిపించినప్పుడు చిత్ర నిర్మాత రాజాను ఈ కథ ఎంతగానో ఆకట్టుకుంది... నిర్మాత రాజా ఎప్పుడూ సానుకూలతతో  ఉంటారూ  అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో మరికొంత తారాగణాన్ని తీసుకోవాల్సి ఉంది అంటూ చెప్పుకొచ్చాడు విజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: