ప్రస్తుతం ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న హీరోయిన్స్ కొరత ఏర్పడటంతో పేరులో ఉన్న హీరోయిన్స్ అంతా ఆచితూచి అడుగులు వేస్తూ తమ సినిమా ప్రాజెక్ట్స్ ను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ విషయాలలో హీరో డైరక్టర్ బ్యానర్ పారితోషికం ఇలా చాలా లెక్కలు వేసుకుంటున్నారు. ఇలాంటి విషయాలలో సాయి పల్లవి తీరు మరింత విభిన్నం.


ఆమెను ఒక మూవీ ప్రాజెక్ట్ విషయంలో ఒప్పించాలి అంటే దర్శక నిర్మాతలు చాలా తిప్పలు పడవలసి వస్తోంది. ఇలాంటి పరిస్థితులలో దర్శకుడు తేజా కు సాయి పల్లవి నుండి తిప్పలు మొదలయ్యాయి అన్న గాసిప్పులు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు  డైరక్టర్ తేజ తన లేటెస్ట్ ప్రాజెక్టు కోసం సాయి పల్లవిని అడిగినట్లు బోగట్టా.


హీరో గోపీచంద్ తో తేజా త్వరలో మొదలు పెట్టబోతున్న ‘అలిమేలు సమేత వెంకటరమణ’ సినిమా కోసం తేజ సాయి పల్లవిని హీరోయిన్ గా చేయమని అడగడమే కాకుండా ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సాయి పల్లవి తేజా రాయబారాలకు నో అని అంటూ తన కాంబినేషన్ గోపి చాంద్ పక్కన బాగుండడు అని సున్నితంగా తిరస్కరించినట్లు టాక్. సాధారణంగా  తేజా తో సినిమాలు అంటే హీరోయిన్లు అంత సులువుగా ఓకె అనరు అని అంటారు. కాజల్ కు మాత్రం ఈ విషయంలో మినహాయింపు.


దీనికితోడు ప్రస్తుతం సాయి పల్లవి రానా చైతన్య నాని లాంటి యంగ్ పాపులర్ హీరోల పక్కన చేస్తున్న పరిస్థితులలో మిడిల్ ఏజ్డ్ హీరో మరియు ప్రస్తుతం ఫెయిల్యూర్ హీరోగా కొనసాగుతున్న గోపీచంద్ పక్కన నటించడం ఇష్టంలేక ఇలా ప్రవర్తించింది అని అంటున్నారు. దీనితో గతంలో గోపి చంద్ పక్కన నటించిన అనుష్క తో తేజా తన రాయబారాలు కొనసాగిస్తున్నట్లు టాక్. ఈ రాయబారాలు కూడ విఫలం అయితే చివరి ఆప్షన్ గా కాజల్ ను ఎంచుకుందామని తేజ ప్లాన్ అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: