అనుభవం కొంతైనా.. ఎంతో నేర్చుకున్నా అంటోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. హీరోయిన్ గా ఎన్నో మెట్లు ఎక్కి కంగనా.. ఈ సారి పూర్తి పూర్తి స్థాయిలో మెగా ఫోన్ పట్టబోతోంది. 

 

కంగనా రనౌత్.. తన సినిమాలో జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూసింది. నటనాపరంగా ఉన్నత శిఖరాలను అందుకున్న ఈ బ్యూటీ.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకొని.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం జయలలిత బయోపిక్ తలైవిలో నటిస్తున్న కంగనా.. త్వరలోనే దర్శకురాలిగా మారబోతోంది. 

 

క్రిష్ డైరెక్షన్ లో మణికర్ణిక మూవీలో కొంత భాగానికి, కంగనానే దర్శకత్వంలో వహించింది. ఎందుకంటే మణికర్ణిక చివరి దశ చిత్రకరణలో.. కంగనా, క్రిష్ మధ్య భేదాభిప్రాయాలు రావడంతో.. క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దాంతో కంగనానే డైరెక్షన్ చేసింది. ఈ అనుభవంతోనే తన నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతోంది. అందుకు బాహుబలి రచయిత కథను సిద్ధం చేశారు.  

 

వివాదాలతో ముడిపడిన అయోధ్య రామమందిర నిర్మాణం ఆధారంగా కేవీ విజయేంద్రప్రసాద్ అపరాజిత అయోధ్య అనే స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ మూవీకి ముందుగా నిర్మాతగానే ఉండాలనుకున్న కంగనా.. విజయేంద్రప్రసాద్ అద్భుతమైన స్క్రిప్ట్ చూసి.. ఈ సినిమాకు తానే డైరెక్ట్ చేస్తే బాగుంటుందని.. తనతో అసోసియేట్ అయినవారు చెప్పారట. 

 

దాంతో తానే డైరెక్షన్ చేయాలని ఫిక్స్ అయినట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. మరి దర్శకురాలిగా కంగనా ఎలా రాణిస్తుందో చూడాలి. కంగనా రనౌత్ ఇప్పటి వరకు నటిగా ప్రేక్షకులను మెప్పించింది. ఇపుడు దర్శకురాలిగా ఎలా తన క్రియేటివీ చూపిస్తుందో చూడాలి. ఎవరిలో ఉండే టాలెంట్ ను ఎలా వెలికితీస్తుందో అని అంతా ఆసక్తి నెలకొంది. ఆమె మెగా ఫోన్ పట్టడంపై అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: