నచ్చావులే సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైనా తెలుగు హీరోయిన్ మాధవీలత.. ఆ తర్వాత పేరున్న సినిమాలేవీ ఆమెకు రాలేదు.. వచ్చిన ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే కాలక్రమేణా ఆమె కనుమరుగైపోయింది. కానీ ఇటీవలే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్ళీ తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానినంటూ వెరైటీ పోస్ట్ లు తన సోషల్ మీడియా లో చేస్తూ కొన్ని రోజులు వివాదాల్లో ఉన్న మాధవీ లత ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్నారు. బీజేపీ నుంచి గుంటూరు వెస్ట్ అసెంబ్లీ అభ్యర్థినిగా పోటీ చేసి డిపాజిట్ల కోల్పోయింది మాధవీలత.

అప్పటినుంచి సైలెంట్ గానే ఉన్న మాధవీ లత రోజుకో పోస్ట్ తో మళ్ళీ వివాదాలను సృష్టించాలని ప్రయత్నించినా అవి ఆమెకు తిప్పికొడుతున్నాయి. ఆమె యాంటీ ఫ్యాన్స్ ఆమెపై చెప్పలేని విధంగా పోస్ట్ లు పెడుతూ చికాకు తెప్పిస్తున్నారు.. దారుణంగా ఆమెకు రిప్లై లు ఇస్తూ అమ్మాయి అనే విషయాన్నీ కూడా మర్చిపోయారు.. దాంతో మాధవీ లత ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు మాధవీలత. ‘ప్రియమైన ఫాలోవర్స్‌.. నా ఫేస్ బుక్‌లో నెగిటివిటీకి పూర్తిగా విసుగుచెందాను. దాదాపు 90 శాతం మంది నాపై నెగిటివ్‌గానే స్పందిస్తున్నారు. ఈ సమాజానికి ఫేక్ అండ్ ప్లాస్టిక్ నవ్వులే కావాలి. నేను అలా ఉండలేను. ఈరోజు నుంచి నా ఫేస్ బుక్‌ని నేను హ్యాండిల్ చేయడం లేదు. ఇకపై నా టీం హ్యాండిల్ చేస్తుంది. ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే ఇంట్రాక్ట్ అవుతాను. నన్ను అభిమానించే వాళ్లు ప్రేమకు సపోర్ట్‌కి చాలా థాంక్స్. ఇకపై ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్‌లో అందుబాటులో ఉంటా’ అంటూ పోస్ట్ పెట్టింది మాధవీలత.గతంలో చాలామంది సెలబ్రిటీలు ఇలా ఫేస్ బుక్ నుంచి తప్పుకుని.. ఆ తరువాత మళ్లీ వెనక్కి రావడం చూస్తూనే ఉన్నాం.. మరి మాధవీలత అలాగే తిరిగి వస్తారో లేక ఈ నెగిటివిటీకి పూర్తిగానే దూరం అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: