ఇక ప్రస్తుతం పరశురామ్ పెట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా సర్కారు వారి పాటలో నటిస్తున్నారు మహేష్ బాబు. తొలిసారిగా మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా గా మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరిగింది. మహేష్ ఒక విభిన్నమైన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. అలానే ఈ మూవీతో మరో సక్సెస్ కొట్టి తదుపరి హ్యాట్రిక్ కి పునాదులు వేయాలని చూస్తున్నారు మహేష్ బాబు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది కానీ మధ్యలో కరోనా కారణంగా ఆగిపోయింది.
దానితో షూటింగ్ కొంత డిలే కావటంతో రిలీజ్ ని కూడా కొన్నాళ్లపాటు వాయిదా వేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అంటూ ఇటీవల యూనిట్ ప్రకటించింది. దానితో మహేష్ బాబు తదుపరి సినిమా కోసం మరొక ఏడాది వరకు ఆయన అభిమానులు ఆగక తప్పని పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఆయన నుండి సినిమా వచ్చే ఏడాది పైగా సమయం గడుస్తుండడం, ఇక సర్కారు వారి పాటకు దాదాపుగా మరో పది నెలల సమయం ఉండటంతో వారు కొంత నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. అయితే మధ్యలో వారు ఏమాత్రం ఢీలా పడకుండా ఉండేలా సర్కారు వారి పాట యూనిట్ పలు స్ఫర్ప్రైజ్ లు ప్లాన్ చేసిందని సమాచారం....!!