హీరో ధనుష్‌, నాచ్యురల్‌ బ్యూటీ సాయిపల్లవి కలిసి నటించిన మారి-2 సినిమా సూపర్ హిట్ అయినా సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రౌడీ బేబీ సాంగ్ సూపర్ హిట్ అయినా సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ఈ పాటను మర్చిపోతున్నారు. గత కొన్ని నెలలుగా యూట్యూబ్ లో ఈ సాంగ్ కి వ్యూస్ కూడా పెద్దగా రావడం లేదు.

ఇక ఈ సాంగ్ ఓల్డ్ హిట్ సాంగ్స్ లిస్ట్ లో చేరిపోయింది అనుకున్న తరుణంలో మళ్ళీ ఓ డాక్టర్‌ పుణ్యమా అని ఇప్పుడు అంతా ‘రౌడీ బేబీ’ని మరోసారి ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సారి ఒరిజినల్‌ ‘రౌడీ బేబీ’ని కాకుండా.. పేరడీ పాటను విని తెగ నవ్వుకుంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం దేశంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతన్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.



కాగా.. ప్రజలకు ఈ విషయంలో అవగాహన పెంచడానికి భాస్కర్‌ అనే డాక్టర్ వినూత్నంగా ఆలోచించి.. గుండె ఆరోగ్యం గురించి చెబుతూ ‘రౌడీ బేబీ’ పాటను పెరడీగా పాడి అందర్నీ నవ్వులు పూయించారు. మధ్యపానం, ధూమపానం చేయకూడదని, ఉప్పు, మసాల కూడా తక్కువగా తినాలని పాట రూపంలో చెప్పడంతో మొత్తానికి ఇప్పుడు ఈ పేరడీ పాట కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ పేరడీ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతుంది.

ఇక ఇప్పటికే ఈ ‘రౌడీ బేబీ’ సాంగ్ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ సాధించి తన పేరిట సరికొత్త రికార్డున నమోదు చేసుకుంది. పైగా ఇండియా సినిమాల్లో ఏ పాటకు రానన్ని వ్యూస్‌ ‘రౌడీ బేబీ’ పాటకు రావడం విశేషం. ఈ సాంగ్ ఇంతగా వైరల్ అవ్వడానికి కారణం సాయిపల్లవి క్రేజీ స్టెప్స్ నే మెయిన్ రీజన్ అని తెలిసిందే. ఈ సాంగ్ లో సాయి పల్లవి వేసిన స్టెప్పులకి ప్రత్యేక సీనీ అభిమానులు ఉన్నారు. అందుకే ఈ పాట యూట్యూబ్ పై దండయాత్ర చేయగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: