
టాలీవుడ్ రౌడీగా పేరు గాంచిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు మన రౌడీ హీరో.ఈ హీరో తరువాత సినిమాకోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి లైగర్ అనే టైటిల్ కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి లయన్, టైగర్ ను కలిపి చూపిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది.సినిమాకి సంబందించిన ఆ ఒక్క పోస్టర్ మాత్రమే ఇప్పటిదాకా రిలీజ్ చేసారు కానీ ఈ మూవీ సంబందించిన అప్ డేట్స్ మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు.
దీనితో ఫ్యాన్స్ వేయిట్ చేయలేకపోతున్నారట.తాము ఎంతగానో అభిమానించే హీరో విజయ్ లుక్ నైనా కనీసం రివీల్ చేయాలని చిత్ర యూనిట్ ని అభిమానులు డిమాండ్ చేస్తున్నారట.విజయ్ దేవరకొండ ఇప్పటిదాకా ఈ సినిమాలో కూడా నటించలేదు. అంతకముందు రిలీజ్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత.. మళ్లీ విజయ్ ఇప్పటివరకు ఆన్ స్క్రీన్ పై కనిపించలేదు.గతేడాది మార్చ్లో లైగర్ షూటింగ్ ప్రారంభమైనా గాని ఇప్పటివరకు చిత్రీకరణ పూర్తవలేదు. ఒక పక్క కరోనా వైరస్ కారణంగా ఏడాది కాలంగా సినిమాకి సంబందించిన నిర్మాణ పనులు అన్ని అలానే ఆగిపోయాయి. యాక్షన్ సన్నివేశాల కోసం విదేశీ యాక్షన్ కొరియోగ్రాఫర్తో పాటు, ఫైటర్స్ కూడా అవసరం పడటంతో, షూట్ ముందుకు వెళ్లడం లేదు. దీంతో లైగర్ ఎప్పుడొస్తుందనేది ఎవరూ చెప్పడం లేదు.ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా మనకి కనిపించబోతున్నాడు. ఇన్నాళ్లపాటు ఓపిక పట్టిన ఫ్యాన్స్ ఇంకా తమ అసహనాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తున్నారు. లైగర్ అప్ డేట్స్ కావాలని పట్టుబడుతున్నారట. కనీసం విజయ్ లుక్ అయినా బయటపెట్టాలని.. డిమాండ్ చేస్తున్నారట. పోస్టర్ లేదా ఓ సాంగ్ అయినా విడుదల చేయాలని చిత్ర బృందాన్ని కోరుతున్నారట.
మరీ అభిమానుల కోరికను పూరీ నెరవేరుస్తాడా ? లేదా ? అనేది చూడాలి. ఇప్పటికి లయన్, టైగర్ క్రాస్ బ్రీడింగ్ అంటూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసినది చిత్ర యూనిట్.ఆ ఒక్క అప్ డేట్ తప్పా ఈ చిత్రానికి సంబందించిన మారె సమాచారం బయటకి రాలేదు. పూరీ సారథ్యంలో చార్మీ, కరణ్ జొహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లైగర్ సినిమాలో విజయ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నే హీరోయిన్ పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలో మరొక పవర్ ఫుల్ రోల్ లో ఒకప్పటి హీరోయిన్ రమ్యకృష్ణ కూడా నటించడం విశేషం అనే చెప్పాలి. ఇక బాలీవుడ్ బ్యూటీ అనన్య ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది.