టాలీవుడ్
సినిమా పరిశ్రమలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా నటిగా మంచి మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న కథానాయిక ఎవరైనా ఉన్నారా అంటే ఆమె
నిత్యామీనన్ అని చెప్పవచ్చు. తెలుగులో
అలా మొదలైంది అనే
సినిమా లో నటించిన ఆమె అది సూపర్ డూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా
టాలీవుడ్ లో భారీ క్రేజ్ ఏర్పడింది
నిత్యా కి. తొలి సినిమాతోనే మంచి అభినయంతో ఆకట్టుకున్న ఈమె స్టార్
హీరోయిన్ అవ్వడం ఖాయం అని అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే
సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.
నితిన్ హీరోగా నటించిన ఇష్క్
సినిమా లో ఛాన్స్ పొందిన
నిత్యా అది కూడా సూపర్ హిట్ కావడంతో
నిత్యామీనన్ కి కూడా బ్యాక్ టూ బ్యాక్ హిట్ లు దక్కినట్లు అయ్యింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. వరుస
సినిమా అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు,
సన్నాఫ్ సత్యమూర్తి ఒక
అమ్మాయి తప్ప , జనతాగ్యారేజ్, గీతగోవిందం వంటి సినిమాలు ఆమెను వరించాయి. అయితే ఆమె తర్వాత కాలంలో
హీరోయిన్ గా చేయడం తగ్గించేసింది. సైడ్ పాత్రలు చేసుకుంటూ వచ్చి తెలుగులో తన
సినిమా కెరీర్ ను అపేసిన్నట్లుగా అనిపించింది.
దాదాపు తెలుగు
సినిమా పరిశ్రమకు ఆమె దూరం అయిపోయిందనే అందరూ అనుకున్నారు కానీ మళ్ళీ ఆమెకు వరుస అవకాశాలు రావడంతో ఆమె మళ్లీ పుంజుకుంది. గమనం అనే సినిమాలో స్పెషల్ పాత్ర చేస్తున్న ఆమె ఇటీవలే పవన్
కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో
హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు సత్యదేవ్ హీరోగా నటిస్తున్న స్కై లాబ్ సినిమాలో
హీరోయిన్ గా చేస్తున్న ఆమె ఇదే కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తోంది. తమిళంలో పెద్ద సినిమాలో ఆమె నటిస్తోంది. మలయాళంలో కూడా రెండు సినిమాలను ఓకే చేసింది. మరి ఈ సినిమాలు ఆమెను మరో రేంజ్ కి తీసుకెళతాయో చూడాలి.