టాలీవుడ్ పరిశ్రమ వైపు ఇప్పుడు దేశం మొత్తం చూస్తుంది. టాలీవుడ్ నుంచి బాహుబలి సినిమా వచ్చిన తర్వాత వచ్చే సినిమాలన్నీ అదే రేంజ్ లో ఉంటాయని దేశంలోని ప్రేక్షకులు అనుకుంటూ ఉండగా వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాలను విడుదల చేస్తూ భారీగా హిట్లను సాధిస్తుంది టాలీవుడ్ సినీ పరిశ్రమ. ఇప్పుడు టాలీవుడ్ సినిమా హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమాలే. చిన్నా పెద్దా అందరూ హీరోలు ఆ తరహా సినిమాలను చేస్తూ ఉన్నారు. ప్రభాస్ మొదలుపెట్టిన ఈ ట్రెండ్ ను అందరూ ఫాలో అవడం విశేషం.

ఇప్పటి వరకు పెద్ద సినిమాలు మాత్రమే భారీ రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి కానీ ఇప్పుడు చిన్న సినిమాలు సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కడానికి సిద్ధమవుతున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు చిత్రం టాలీవుడ్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. రమేష్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ టాలీవుడ్ లో రాబోతున్న విషయం తెలిసిందే. తమిళనాట విడుదలై సూపర్ హిట్ సాధించిన రాచ్చసన్ సినిమాకు ఇది రీమేక్ కాగా తమిళంలో లేని సీక్వెల్ మన తెలుగువారు ఇక్కడ చేస్తుండడం విశేషం. 

అయితే మీడియం బడ్జెట్ రేంజ్ లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ కాగా ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా వస్తున్న రాక్షసుడు 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదటి భాగం లాగా ఈ సీక్వెల్ చిన్న బడ్జెట్ తో తెరకెక్కడం లేదట. భారీ బడ్జెట్ తోనే రాబోతుందట. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావాలని అనుకోవడం లేదు అని ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. ఓ స్టార్ హీరో ఇందులో నటిస్తారు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: