సౌత్ ఇండియన్ హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. ఇక ఇమే విగ్నేష్ తో ప్రేమాయణం జరుగుతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక వీరిద్దరికి సంబంధించి ఏదో ఒక విషయం ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా హీరోయిన్ సమంత వీరిద్దరికి ఒకేసారి కంగ్రాట్యులేషన్స్ తెలుపుతోంది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.


ఇక తన ప్రియుడు విగ్నేష్ తో కలిసి నయనతార ఒక తమిళ సినిమాని నిర్మించింది. ఆ చిత్రం ఆస్కార్ ఎంట్రీని దక్కించుకోవడంతో  ఈ విషయంపై సమంత స్పందించడం పై చాలా హాట్ టాపిక్ గా మారుతోంది ఈ విషయం. నయనతారకు కాబోయే భర్త,దర్శకుడు విగ్నేష్ తో"కూజంగల్"సినిమాని నిర్వహించింది. ఇక ఈ సినిమాని కొన్ని వాస్తవ సంఘటనల ద్వారా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి డైరెక్టర్ పి.ఎస్ వినోద్ రాజ్. ఈ చిత్రం 94 వ ఆస్కార్ పురస్కారాలలో ఉత్తమ విదేశీ సినిమా కేటగిరిలో భారతదేశం నుంచి ఈ సినిమా ఎంపిక కావడం జరిగింది.

 ఈ విషయంపై సమంత తన తరఫునుంచి కంగ్రాట్యులేషన్స్ తెలిపింది. కూజంగల్ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాకుండా నయనతార-విగ్నేష్ లకు బెస్ట్ విషెస్ కూడా తెలిపింది. రాబోయే రోజుల్లో మిరిద్దరికీ ఇంకా బలం చేకూరలని కోరుకుంటున్నాను తెలిపింది.సోషల్ మీడియా లో ఈ పోస్ట్ షేర్ చేయడం వల్ల అది వైరల్ గా మారుతోంది.
ఇక విగ్నేష్ ఈ విషయంపై స్పందిస్తూ.. ఆస్కార్ అవార్డ్ గెలవడానికి కేవలం రెండు అడుగుల దూరంలో ఉన్నానని తెలియజేశాడు. ఇలాంటి సినిమా తెరకెక్కించేందుకు గర్వపడుతున్నానని విగ్నేష్ సమంతకు రిప్లై ఇచ్చాడు. ఈ విషయంపై నెటిజన్లు కూడా ఎంతో సంబరపడిపోతున్నారు. నయనతర అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ఇక సమంత నాగచైతన్య తో విడిపోయిన తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలోనే తన సమయాన్ని గడుపుతోంది. సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం చెబుతూ బాగా వైరల్గా అవుతోంది సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి: