యాంకరింగ్ లో కొత్తదనాన్ని చూపుతూ తనదైన శైలిలో అలరించిన యాంకర్ ఉదయభాను. యాంకరింగ్ స్టైల్ ను సరికొత్తగా కనబరచి ట్రెండ్ క్రియేట్ చేసింది ఈ ముత్యాల బామ. బుల్లితెరపై హాట్ గా కనిపించిన తొలి యాంకర్ ఈమె అని చెప్పడంలో సందేహం లేదు. చూపు తిప్పుకోలేని ఆరుడగుల అందం ఈమె సొంతం. గల గల మాటల సవ్వడితో ప్రేక్షకులను తన వైపు తిప్పుకోగల వాక్చాతుర్యం తన ఆయుధం. స్మాల్ స్క్రీన్ పైనే కాదు సిల్వర్ స్క్రీన్ పై కూడా అవకాశాలు అందుకుని తన టాలెంట్ ను కనబరిచింది ఈ సుందరి. దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం లీడర్ లో "రాజశేఖర నీపై మోజు తీరలేదురా" అంటూ స్పెషల్ సాంగ్ లో రానా తో స్టెప్పులు వేసి అందరినీ మత్తులో ముంచెత్తింది.

ఆ తర్వాత కూడా జులాయి, కొండపల్లి సింహాసనం వంటి చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగు లోనే కాకుండా
తమిళ, కన్నడ సినిమాలలోనూ నటించారు. అసలు ఈమె కెరియర్ 10 వ తరగతి చదువుతున్న సమయంలోనే మొదలయ్యింది. ఆ టైం లో హృయాంజలి అనే షోతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత వన్స్ మోర్ ప్లీజ్,  డాన్స్ బేబీ డాన్స్, సాహసం చేయరా డింభకా వంటి షోలతో మంచి గుర్తింపు పొందింది. ఈమెకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడే ఒక ముస్లిం వ్యక్తితో పెళ్లి చేశారు కుటుంబ సభ్యులు. అయితే ఆమెకు ఆ పెళ్లి ఇష్టం లేకపోవడంతో విడాకులు తీసుకుని విజయకుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

అనంతరం వీరికి ఇద్దరు కమల పిల్లలు పుట్టడంతో వారి అలనా పాలనా దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశంతో కొన్నాళ్ళు కెమెరాకు దూరమయ్యారు ఉదయ భాను. ఆ తర్వాత కొన్నాళ్లకి రీ ఎంట్రీ ఇచ్చారు కానీ క్రేజ్ గ్రాఫ్ బాగా తగ్గడంతో పెద్దగా అవకాశాలు అందలేదు. ఒకప్పట్లో స్టార్ యాంకర్ గా, నటిగా.. ఒక వెలుగు వెలిగిన ఉదయభానుకు ఇపుడు ఇండస్ట్రీకి కాస్త దూరంగానే అంటున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడూ సామజిక సమస్యలపైన తన ఉద్దేశ్యాన్ని తెలుపుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: