సినిమా పరిశ్రమలో ఏదైనా ఒక కాంబో సూపర్ హిట్ అయితే అదే కాంబో లో మళ్లీ సినిమా రావాలని అభిమానులు భారీగా డిమాండ్ చేస్తూ ఉంటారు. అయితే ఏదైనా ఒక కొత్త క్రేజీ కాంబో రావాలన్నా కూడా అదే ప్రేక్షకులు వారి కలయికలో ఓ సినిమా రావాలని అడుగుతూ ఉంటారు. ఆ విధంగా కొన్ని కాంబినేషన్లు ఈ సంవత్సరంలో వస్తాయని ప్రేక్షకులకు ముందుగా ఊరించి కొన్ని రోజులుగా అందని ద్రాక్ష లాగా ఆ కాంబినేషన్ లు సినిమాలు చేయలేకపోతున్నాయి. అలాంటి కాంబినేషన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

విజయ్ దేవరకొండ సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది అని గతంలో వార్తలు వినిపించాయి. అయితే పుష్ప పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్ ఈ చిత్రాన్ని రోజు రోజుకు పోస్ట్ ఫోన్ చేస్తున్నారు.అయితే ఈ కాంబో ఎప్పుడు సినిమా మొదలు పడుతుందో చూడాలి. నందమూరి బాలకృష్ణ మరియు పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో పైసా వసూల్ అనే సినిమా రాగా ఆ సినిమా విడుదల సమయంలోనే పూరి జగన్నాథ్ తొందరలోనే బాలకృష్ణ తో సినిమా చేస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికీ కుదరకపోవడంతో ఇప్పటికీ ఆ కాంబో లోని సినిమా అలాగే ఉంది.

వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఐకాన్ అనే సినిమా తెరకెక్కబోతోందని గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు పోవడం గమనార్హం. ధనుష్ మరియు శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా అనగానే అందరూ ఎంతో రిఫ్రెష్ ఫీల్ అయ్యారు. ఓ సరికొత్త ఈ సినిమా చూడొచ్చు అని భావిస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా ఇంకా పట్టాలెక్కక పోవడం నిరాశ కలిగిస్తుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ సినిమా తర్వాత శ్రీకాంత్సినిమా చేయాల్సి ఉండగా అది అనుకోని కారణాల వల్ల క్యాన్సల్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: