టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ గా నిలిచిన ‘అల వైకుంఠ పురములో’ మూవీ విడుదలై రెండు సంవత్సరాలు గడిచిపోయినా మరొక సినిమాను త్రివిక్రమ్ మొదలు పెట్టలేకపోయాడు. మొదట్లో జూనియర్ తో సినిమా అంటూ అధికారిక ప్రకటన వచ్చి కూడ ఆమూవీ పట్టాలు ఎక్కలేదు. ఆతరువాత మహేష్ తో సినిమా ఫైనల్ అయినప్పటికీ ఆమూవీ ఎప్పుడు మొదలవుతుందో త్రివిక్రమ్ కు తెలియని పరిస్థితిగా మారింది అంటున్నారు.


‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ ఇంకా 40శాతం మిగిలి ఉంది అంటున్నారు. రెండు నెలల క్రితం మహేష్ కాలుకు ఆపరేషన్ జరగడంతో ప్రస్తుతం మహేష్ రెస్ట్ లో ఉన్నాడు. ఈమధ్యనే మహేష్ అన్నయ్య రమేష్ చనిపోవడంతో మహేష్ చాల మూడీగా ఉండటంతో పాటు కరోనా ఎఫెక్ట్ కావడంతో కరోనా తగ్గినప్పటికీ ప్రస్తుతం మహేష్ పెద్దగా ఎవర్ని కలవడానికి ఆశక్తి కనపరచడం లేదు అని టాక్.


ఈ నైరాశ్యం కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులు అదుపులోకి వస్తే కానీ మహేష్ మళ్ళీ షూటింగ్ లకు వచ్చే ఆస్కారం లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా థర్డ్ వేవ్ మార్చికి కానీ అదుపులోకి రాదు అని అంటున్నారు. ఆతరువాత మాత్రమే మహేష్ ‘సర్కారు వారి పాట’ ను పూర్తి చేయడానికి సెట్స్ పైకి వస్తాడు. అది పూర్తి చేసి త్రివిక్రమ్ మూవీ వైపు రావడానికి జూన్ నెల వచ్చినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.


ఈ పరిస్థితితో మహేష్ తో సినిమా ప్రారంభానికి ముందే మరొక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాను సమంత తో తీసే ఆలోచనలలో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక ప్రముఖ రచయిత వ్రాసిన నవలను కొన్న త్రివిక్రమ్ ఆ నవలను ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా మార్చి సమంతతో వేగంగా సినిమా పూర్తి చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కూడ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈలోపున మహేష్ సినిమా క్యాన్సిల్ కాకుండా సంగీత దర్శకుడు తమన్ చేత పాటల ట్యూన్ చేయిస్తూ ఒక భారీ సినిమా మరో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాను ఇలా రెండిటిని ఈ సంవత్సరం ఏదోవిధంగా పూర్తి చేయాలని త్రివిక్రమ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట..


మరింత సమాచారం తెలుసుకోండి: