మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం
పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సర్కార్ వారి పాట
సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు మహేష్ బాబు. ఈ
సినిమా తర్వాత
త్రివిక్రమ్ దర్శకత్వంలో
సినిమా చిత్రీకరణ కోసం ఎదురు చూస్తున్నారు. పలుమార్లు ఈ
సినిమా యొక్క షూటింగ్ ను జరుపుతూ వచ్చాడు మహేష్. ఇప్పటికే ఈ
సినిమా మొదలుపెట్టి షూటింగ్ పూర్తి చేయవలసింది. కానీ అది కుదరలేదు.
సర్కారు వారి పాట
సినిమా తో పాటే షూటింగ్ జరుపుకోవాల్సిన ఈ
సినిమా ఎందుకో మొదలు కాలేదు. ఈ నేపథ్యంలోనే
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు త్వరలో మొదలు కాబోతున్న కూడా ఈ
సినిమా మొదలు కాక పోవడం పట్ల అసలు ఈ
సినిమా ఉందా అన్న అనుమానం ఒక వైపు ఎక్కువ అవుతుంది. మహేష్ కూడా ఈ
సినిమా గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారని చెప్పవచ్చు.
తాజాగా ఎట్టకేలకు మహేష్ సన్నిహితుల నుంచి ఈ
సినిమా సమాచారం వచ్చినట్లుగా తెలుస్తుంది. మే నెలలో సర్కారు వారి పాట
సినిమా ను విడుదల చేసిన తర్వాత
జూన్ నెలలో
త్రివిక్రమ్ సినిమా ను మహేష్ బాబు మొదలుపెడతాడు. ఈ నేపథ్యంలో
జూన్ నెలలో ఈ సినిమాను మొదలు పెట్టి ఈ ఏడాది చివర్లో పూర్తి చేయనున్నారు. ఆ విధంగా ఆ వెంటనే
రాజమౌళి సినిమాను మొదలు పెడుతున్నాడు ప్రిన్స్. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ
సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఆ విధంగా మూడు సినిమాలకు సంబంధించిన మహేష్ బాబు లైనప్ అధికారికంగా ప్రకటించకపోయినా అభిమానులు మాత్రం ఈ లైనప్ కు రిలాక్స్ అవుతున్నారు. ఈ ఏడాది సర్కారు వారి పాట
సినిమా విడుదల చేసి వచ్చే ఏడాది తొలి భాగంలో
త్రివిక్రమ్ సినిమా విడుదల తర్వాత వచ్చే ఏడాది చివర్లో
జక్కన్న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏదేమైనా మహేష్ ప్లాన్ అదిరిపోయింది అనే చెప్పాలి.