ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సలార్. శృతిహాసన్ కథానాయకగా నటిస్తున్న ఈ సినిమా యొక్క షూటింగ్ త్వరలోనే తిరిగి జరుపుకొనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కొంత భాగం షూటింగును పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ప్రభాస్ ఇతర చిత్రాల చిత్రీకరణలో బిజీ కాగా ఇప్పుడు ఈ సినిమాను మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఇటు దర్శకుడు ప్రశాంత్ కూడా మొన్నటిదాకా కే జి ఎఫ్ రెండవ భాగం సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులలో విడుదల పనులలో బిజీగా ఉన్నాడు.

ఆ చిత్రం విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో తన పూర్తి ఫోకస్ ఈ చిత్రం పైనే పెట్టనున్నాడు. ఈ సినిమాను కూడా కేజిఎఫ్ స్థాయిలో విజయం అందుకునే విధంగా ఆయన ప్రణాళికలు రచించాడని చెబుతున్నారు. వాస్తవానికి ప్రభాస్ కే జి ఎఫ్ సినిమా కంటే ముందే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఈ దర్శకుడుతో కలిసి చేస్తున్న సినిమా కే జి ఎఫ్ ను మించి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అసలే వరుస ప్లాపులతో సతమతమవుతూ తన పాన్ ఇండియా కెరియర్ను ప్రశ్నార్థకంలో పడేసుకున్న ప్రభాస్ ఈ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారు. 

వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండగా దీనికంటే ముందే ప్రభాస్ ఓ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. మారుతి దర్శకత్వంలోని సినిమాను తొందరలోనే మొదలుపెట్టబోతున్నాడు. ఈ సినిమా ను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలన్నది ప్రభాస్ ఆలోచన. ఇక బాలీవుడ్ లో తెరకెక్కిన ఆది పురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది. దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.  రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకేక్కుతుండడం ఈ సినిమా పై ఇంతటి అంచనాలు నెలకొనడానికి కారణం. 

మరింత సమాచారం తెలుసుకోండి: