ప్రభాస్ హీరోగా
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సలార్.
శృతిహాసన్ కథానాయకగా నటిస్తున్న ఈ
సినిమా యొక్క షూటింగ్ త్వరలోనే తిరిగి జరుపుకొనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కొంత భాగం షూటింగును పూర్తి చేసుకుంది. ఆ తర్వాత
ప్రభాస్ ఇతర చిత్రాల చిత్రీకరణలో బిజీ కాగా ఇప్పుడు ఈ సినిమాను మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఇటు దర్శకుడు ప్రశాంత్ కూడా మొన్నటిదాకా కే జి ఎఫ్ రెండవ భాగం
సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులలో విడుదల పనులలో బిజీగా ఉన్నాడు.
ఆ చిత్రం విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో తన పూర్తి ఫోకస్ ఈ చిత్రం పైనే పెట్టనున్నాడు. ఈ సినిమాను కూడా
కేజిఎఫ్ స్థాయిలో విజయం అందుకునే విధంగా ఆయన ప్రణాళికలు రచించాడని చెబుతున్నారు. వాస్తవానికి
ప్రభాస్ కే జి ఎఫ్
సినిమా కంటే ముందే పాన్
ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఈ దర్శకుడుతో కలిసి చేస్తున్న
సినిమా కే జి ఎఫ్ ను మించి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అసలే వరుస ప్లాపులతో సతమతమవుతూ తన పాన్
ఇండియా కెరియర్ను ప్రశ్నార్థకంలో పడేసుకున్న
ప్రభాస్ ఈ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారు.
వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండగా దీనికంటే ముందే
ప్రభాస్ ఓ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు.
మారుతి దర్శకత్వంలోని సినిమాను తొందరలోనే మొదలుపెట్టబోతున్నాడు. ఈ
సినిమా ను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలన్నది
ప్రభాస్ ఆలోచన. ఇక
బాలీవుడ్ లో తెరకెక్కిన
ఆది పురుష్
సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది. దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. రామాయణం ఆధారంగా ఈ
సినిమా తెరకేక్కుతుండడం ఈ
సినిమా పై ఇంతటి అంచనాలు నెలకొనడానికి కారణం.