విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కైకాల సత్యనారాయణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఎన్నో సినిమాలలో ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలు వేసి మరింత మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో మంచానికే పరిమితమై చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇటీవల కైకాల పుట్టినరోజు వేడుకలను చిరంజీవి చాలా ఘనంగా జరిపించినట్లు అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక పూర్తి విషయాన్ని ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25 వ తేదీన జన్మించిన ప్రముఖ సీరియల్ నటులు కైకాల సత్యనారాయణ.. సీనియర్ ఎన్టీఆర్ కి గా తన కెరీర్ ను  మొదలుపెట్టారు. ఇక అదే సమయంలోనే ఆయనలో ఉన్న ప్రతిభను గుర్తించి సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించారు ఎన్టీఆర్. ఇక అప్పటినుంచి ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించిన ఆయన మహర్షి , ఎన్టీఆర్ కథానాయకుడు వంటి చిత్రాలలో కూడా నటించి ఈ తరం ప్రేక్షకులకు కూడా తన ప్రతిభ ఏంటో నిరూపించారు.ఇక కే జి ఎఫ్ సిరీస్ కి తెలుగులో సమర్పకులుగా వ్యవహరించిన ఈయన ఈరోజు తన 27వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇక ఈ వేడుకను ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి మరీ నిర్వహించారు. ఇక ఈ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసి ఆయన ఈ విషయాన్ని తెలియజేయడంతో ప్రతి ఒక్కరు కైకాల సత్యనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా.."పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున వారిని ఇలా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం నాకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తినీ అందించింది. ఇక ఆ భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: